సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) జిల్లా కార్యదర్శి పాయం చిన్న చంద్రన్న
Thovva web news.31Jan.wed

మహారాష్ట్ర నాగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ అమరావతి వరకు ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవే కింద భూములు కోల్పోతున్న 18 గ్రామాల రైతాంగానికి తగు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) జిల్లా కార్యదర్శి పాయం చిన్న చంద్రన్న డిమాండ్ చేశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ7 మండలాలలో సుమారు 243 హెక్టార్ల భూమిని గ్రీన్ ఫీల్డ్ హైవే కింద సేకరిస్తున్నారని,దానిలో రెండు వేల మంది రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఎకరం రెండు ఎకరాలు ఉన్న చిన్నతరహా రైతాంగం ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నారని వారికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం 10 నుండి 15 లక్షల పరిహారమే ఇచ్చి అది కూడా 500 మంది రైతాంగానికి అందించి నేషనల్ హైవేస్ అథారిటీ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఏడు మండలాలలో నష్టపోతున్న చిన్న సన్నకారు రైతాంగానికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని ఇతర జిల్లాలలో 25 నుంచి 30 లక్షల వరకు నష్టపరిహారం ఇచ్చారనే ప్రచారం సాగుతుందని విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని. రైతాంగం నుంచి భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం నిబంధనల మేరకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడం సరికాదని ఆయన తెలిపారు. విలువైన పంట భూములను కోల్పోతూ కుటుంబ పోషణ లేక నిర్వాసితులవుతున్న పేద,దళిత,గిరిజన,బడుగు బలహీన వర్గాల రైతాంగానికి కేంద్ర ప్రభుత్వమే ఇంటికో ఉద్యోగం లేదా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చంద్రన్న డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంద జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి,జిల్లా నాయకులు పూనెం ప్రభాకర్, ములుకూరు జగ్గన్న, ముంజంపల్లి వీరన్న,బిళ్ళ కంటి సూర్యం తోపాటు ఉమ్మ గాని సత్యం, బండపల్లి వెంకటేశ్వర్లు,జక్కుల యాకయ్య, కే భాస్కర్ రెడ్డి, పైండ్ల యాకయ్య,జోగ రాములు ఏరుగొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు…..