జిల్లా నేర సమీక్ష సమావేశం లో ఎస్పీ.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ,
Thovva web news.in //31.Jan.wed

ప్రజల శాంతిభద్రత లే పోలీస్ అధికారుల ఆశయం అని
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలో టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు వాటి పురోగతిపై సంబంధిత అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.పోలీస్ స్టేషన్ల వారీగా. యు ఐ కేసులు తగ్గించుకోవాలన్నారు. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు,క్రైమ్ అగైనెస్ట్ ఉమన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సి అర్ పి ఎస్ తదితర కేసులను సమీక్ష చేశారు. మిసింగ్ కేసులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని త్వరితగతిన కనుగొనేలా చేయాలని ఆదేశించారు.అరెస్టులు, చార్జ్ షీట్లు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా చూసుకోవాలని వాటికి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నమోదైన కేసులలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి నేరస్తులు తప్పించుకునే వీలు లేకుండా న్యాయ స్థానాలలో తగిన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అన్నీ ఆదారాలు సేకరించి చార్జిషీట్ ఢాకాలు చేయాలన్నారు. పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను సిసిటిఎన్ఎస్ లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు. ఆయా కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు సూచించారు. ఫోక్సో కేసులు మరియు రేప్ కేసులలో దర్యాప్తు వేగాన్ని పెంచాలని, ఇతర కీలకమైన కేసుల్లో శాస్త్రీయ పద్ధతులలో దర్యాప్తు సమగ్రంగా చేపట్టాలని, మహిళల, చిన్నారుల అదృశ్యం కేసులలో ఏ విధమైన అలసత్వం చూపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, తప్పిపోయిన వారిని పట్టుకొనుటలో నిబద్ధత చూపించాలని సూచించారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని దొంగిలించిన సొత్తును రికవరీ చేయాలన్నారు. బీట్లు, పికెట్స్ ఏర్పాటు చేసుకొని అధికారులు తరుచుగా బీట్ చెక్ చేస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వాలన్నారు. దొంగతనాలు, దోపిడీలు, తదితర నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.దొంగతనాలను అరికట్టేందుకు హైవే రహదారులపై వాహనాల తనిఖీలు చేస్తూ ప్రత్యేక చొరవ చూపాలని అలాగే అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని పాపిలాన్ పరికరం ద్వారా వారి వేలి ముద్రలను తనిఖీ చేయాలి.రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వాహన తనిఖీలు చేపట్టి ఎం.వి.చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ, ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోన్ యాప్ ల మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్యం చేయాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన మట్కా, పేకాట, అక్రమ మద్యం రవాణాపై ముందస్తు సమాచారం సేకరించి వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాలను రవాణా మరియు విక్రయించే వారిపై ఎండిపిఎస్ కేసులు నమోదు చేయాలన్నారు.గంజాయి రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షించాలి అన్నారు . వీటిని అరికట్టడం వల్ల చిన్న పిల్లలను మరియు యువతను కాపాడుకోగలుగుతాము అన్నారు.అధికారులు ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుని ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా వ్యవహరించాలి పూర్తిస్థాయిలో విచారణ దర్యాప్తు చేసి ఖచ్చితమైన ఆధారాలతో కోర్టుకు సమర్పించి బాధితులకు సరైన న్యాయం చేయాలన్నారు.ఈ కార్యాక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చిన్నయ్య,డీఎస్పీలు తీరదలా సత్యనారాయణ, వెంకటేశ్వరా బాబు, విజయ్ ప్రతాప్, జిల్లా సిఐలు, ఎస్.ఐల తో పాటు స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలాజీ వరప్రసాద్, డిసిఅర్బిసీఐ శ్రీనివాస్,ఐటీ సెల్ సీఐ నరేందర్, అధికారులు , పాల్గొన్నారు.
