సర్పంచుల సేవలు కొనియడిన అధికారులు నేతలు…
మండల పరిషత్ కార్యాలయంలో మాజీ సర్పంచుల సందడి ,…
Thovva web news.01Feb.The


నర్సింహులపేట
నరసింహుల పేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ టేకుల సుశీల యాదగిరి రెడ్డి అధ్యక్షతన మండలంలోని 22 గ్రామపంచాయతీల సర్పంచులకు వీడ్కోలు సమావేశంన్ని ఘనంగా ఏర్పాటు చేశారు.సర్పంచులకు శాలువాలు పుష్ప గుచాలు అందించి సన్మానించారు..ఈ సందర్భంలోఎంపీపీ టేకుల సుశీల యాదగిరి రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు చేసిన సేవలు అభినందనీయం అన్నారు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు వైకుంఠధామాలు డంపింగ్ యార్డులు ఇలా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. ఎంపీడీవో భారతి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా నిస్వార్థంతో సేవలందించిన సర్పంచులుగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారుఈ కార్యక్రమంలో ఎంపీపీ సుశీల వైస్ ఎంపీపీ దేవేందర్ ఎంపీడీవో భారతి ఎంపీఓ సోమ్లాల్, తహసిల్దార్ వివేక్ పంచాయతీరాజ్ డిఇ నర్సింగ్ నాయక్, ఎస్సై సతీష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టేకుల యాదగిరి రెడ్డి, ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, కో అప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
