వెట్టి చాకిరీ చేయిస్తున్న 38 మంది యాజమాన్యం పై కేసులు నమోదు.
జిల్లా ఎస్పీ… డా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్.,
Thovva web news.//2.Feb Friday ..


బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ వివిధ శాఖల సహకారంతో ప్రతి ఏటా రెండుసార్లు జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ వంటి కార్యక్రమాలను నిర్వహించి అనేక మంది బాలకార్మికులకు విముక్తి కల్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్. అన్నారు.శుక్రవారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తూ.
నేటి బాలలే రేపటి పౌరులని..! చిన్నారులే దేశ ప్రగతికి సోపానాలని..! కానీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటి హైటెక్ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరి వ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోందిని..! బాలకార్మిక వ్యవస్థ.. చిట్టి చేతులను చిత్ర హింసలు పెడుతోందన్నారు..అపరేషన్ స్మైల్ ద్వారా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య గారి నేతృత్వంలో 58 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించడం జరిగిందనీ ఇందులో 12 మంది అమ్మాయిలు ఉండగా 46 మంది బాలురు ఉన్నారు.. వారిని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించడం జరిగిందని, హాజరు పరచిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. బాలలను కార్మికులుగా పెట్టుకున్న యజమానులపై మొత్తం 38 మంది పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మరియు ఉత్తమ ప్రతిభ కనపరచిన ఆర్.ఎస్.ఐ సునందా (మహబూబాబాద్ టీం ) మరియు ఎస్.ఐ మౌలానా ( తొర్రూర్ టీం ) వారికీ ప్రశాంస పత్రం అందించారు జిల్లాలో బాల కార్మికులు గా పనిలో పెట్టుకున్న వారి తో వెట్టి చాకిరీ చేయిస్తున్న 100.1098 కి తెలియజేయాలన్నారు.