RBIఈ కేవైసీ తో ..అప్డేట్ విషయంలో పార హుషార్
THOVVA WEB NEWS.//.//2.Feb Friday ..


మనం రోజూ దైనందిన జీవితంలో ఎదో ఒక పని మీద బిజీ గా వుంటాం అటువంటిసమయంలో అర్జెంట్ గా మన సెల్ కి కాల్ వస్తుంది మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం మీ kyc అప్డేట్ చేసుకోలేదు వెంటనే ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి OTP నంబర్ చెప్పండి అంటారు బ్యాంక్ వారే కదా అనుకొని పొరపాటున మాన OTP నంబర్ చెప్పమో నిమిషాల్లోనే మన ఎకౌంట్ లు ఖాళీచేస్తున్నరు సైబర్ నేరగాళ్లు ఇటీవల దేశ వ్యాప్తంగా విజృభిస్తు అమాయకులను వలలో పడి ఎకౌంట్ లను లూటీ చేస్తున్నారు.దీనిపై శుక్రవారం కీలక ప్రకటన చేసింది RBIకేవైసీ అప్డేట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలను హెచ్చరించింది. కేవైసీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని సంస్థలతో ఆధార్ పాన్ కార్డ్. బ్యాంక్ బుక్ ఇతర ముఖ్యమైన పత్రాలను ఇవ్వవద్దని సూచించింది.కేవైసీ అప్డేట్ల పేరుతో తరచుగా మోసాలు జరుగుతన్న నేపథ్యంలో వాటిని నివారించడానికి జాగ్రత్తలు పాటించాలని కోరుతూఇలాంటి మోసాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ గతంలో కూడా ప్రజలను హెచ్చరించింది.
అలాగే అకౌంట్ లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్, కార్డ్ సమాచారం, పిన్, పాస్వర్డ్, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది.సాధారణంగా ఇటువంటి మోసాలు ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ వంటి వాటి ద్వారా జరుగుతున్నాయని ఆర్బీఐ పేర్కొంది. ఇలా వచ్చిన వాటికి స్పందించి వ్యక్తిగత సమాచారం, అకౌంట్ లాగిన్ వివరాలను బహిర్గతం చేయడం, సందేశాలలో అందించిన లింక్ల ద్వారా అనధికారిక లేదా ధ్రువీకరించని యాప్లను ఇన్స్టాల్ చేయడం వంటివి చేస్తూ కస్టమర్లు మోసపోతున్నారని వివరించింది.కేవైసీ అప్డేట్ కోసం మెసేజ్ కానీ మెయిల్ కానీ వచ్చినప్పుడు నేరుగా మీ బ్యాంక్, సంబంధిత ఆర్థిక సంస్థను సంప్రదించాలని ఆర్బీఐ ప్రత్యేకంగా చెప్పింది బ్యాంక్, ఫైనాన్స్ సంస్థల కాంటాక్ట్ నంబర్, కస్టమర్ కేర్ ఫోన్ నంబర్ను దాని అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే పొందాలని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఏదైనా సైబర్ మోసం జరిగినప్పుడు కస్టమర్లు వెంటనే బ్యాంక్, ఫైనాన్స్ సంస్థకు తెలియజేయాలని సైబర్ క్రైమ్ విభాగానికి తెలుపాలని హెచ్చరించింది.

Thovva web news.//2.Feb Friday ..