ప్రజాబలం లేక ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీ
బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం తగదు…
Thovva web news.06 feb wed..

బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం తగదనీ అయన మాట్లాడిన తీరుదారుణమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని గాంధీ సెంటర్లో బాల్క సుమన్ చిత్రపటాన్ని దగ్ధం చేసి నిరసన తెలిపారు.సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ప్రజలు చిత్తుగా ఓడించినా సుమన్కు బుద్ది లేదన్నారు. నోటి కొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఈ తిట్లకు సృష్టి కర్త కేసీఆర్ అని, అధికారం తల కెక్కి అందరిని ఇష్టమొచ్చినట్టు కేసీఆర్ తిట్టారని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మార్పు రావడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్కు భవిష్యత్ లేదని, ఆ పార్టీ ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు. బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
సీఎం స్థాయి వ్యక్తిపై చెప్పు చూపుతూ విమర్శలు చేయడం సిగ్గుచేటని తెలిపారు.దిగజారుడు రాజకీయాలు బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. విమర్శలు మరో మారు పునరావృతం అయితే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,ఎంపీటీసీ ముద్దం విక్రమ్ రెడ్డి, కౌన్సిలర్లు రోజా ప్రభుదాస్, భూసాని రాము, నర్కుటి గజానంద్, నాయకులు అచ్చిరెడ్డి ధర్మారపు మహేందర్, నాగయ్య, దీకొండ మధు,బి వెంకన్న యాదవ్, కల్లూరి కుశాల్,మొగుళ్ళ లింగన్న గౌడ్,వెన్నం సోమిరెడ్డి, ఇట్టే సోమిరెడ్డి, ఇమ్మడి శీను,వీరన్న గౌడ్,నల్లమాస మహేష్, సోమలింగం తదితరులు పాల్గొన్నారు.