12 తులాల బంగారం.53 తులాల వెండి ఒక్ వాహనం స్వాధీనం…
మేడారం వెళ్ళే భక్తులు అప్రమత్తంగా వుండండి.
ట్రైనీ ఎస్పీ చేతన్ నితిన్
జిల్లా అడిషనల్ ఎస్పీ జే. చెన్నయ్య .డి ఎస్పీ సత్యనారయణ….
Thovva web news.08.feb Thu..
అంతరాష్ట్ర దొంగలను చాకచక్యంగా పట్టుకొని వారి వద్ద నుంచి 12 తులాల బంగారం, 53 తులాల వెండి, పల్సర్ బైకు స్వాధీనం. చేసుకున్నట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య.ట్రైనింగ్ ఎస్పి చేతన్ నితిన్ డి ఎస్పీ సత్యనారయణ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న వస్తువులని చూపించి అనంతరం వివరాలు వెల్లడిస్తూ
గురువారం ఉదయం మహబూబాబాద్ రూరల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి బి. రమేష్ టౌన్ SI T. రామారావు వారి సిబ్బందితో మహబూబాబాద్ పట్టణంలోని వివేకానంద సెంటర్ వద్ద వెహికల్ చెకింగ్ చేయుచుండగా ఒక పల్సర్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా వస్తుండగా వారిని పట్టుకొని బండి కాగితాలు అడుగు గా వారి వద్ద ఎలాంటి బండి కాగితాలు లేకపోవడంతో అనుమానంతో వారిని విచారించగా వీరు ఇరువురు మరో మహిళ కన్నా రేణుక తో కలిసి గత కొద్ది రోజుల నుంచి కొత్తగూడెం, మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో పలు దొంగతనాలు చేసి వాటిని వరంగల్ లో అమ్ముకు రావడానికి దొంగతనం చేసిన పల్సర్ బండిపై పోతున్నామని ఒప్పుకోన్నారని తెలిపారు వారి వద్ద నుండి 5 కేసులకు సంబందించిన ప్రాపర్టీ ని స్వాధీనపరచుకొని రిమాండ్ తరలిస్తామని కన్న రేణుక దాసరి జంపయ్యపరారిలో వున్నారని తెలిపారు

నిందితుల వివరాలు
పొన్నాల శివశంకర్ సత్యనారాయణపురం, యానం బైలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.ఎడ్ల సుమన్ సమ్మయ్య, అనంతరం, గా గుర్తంచమన్నారుభద్రాద్రి కొత్తగూడెం కు చెందిన శివశంకర్ చిన్నప్పటినుండి ఏమి చదువుకోకుండా కూలీ పనులు చేసుకుంటూ బతికే వాడని. 2008 సంవత్సరంలో పెళ్లి అయిన నాలుగు సంవత్సరాల కాపురం చేసి భార్యను వదిలి వేశాడని అప్పటినుండి తాగుడుకు, చెడు అలవాట్లకు అలవాటు పడి జల్సాలు తీర్చుకోవడానికి పందిరి వెంకటేశ్వర్లు, ప్రశాంత్, రమేష్, తిరుపతిరావు, దాసరి జంపయ్య, శివకృష్ణ లతో కలిసి ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, హైదరాబాద్, నెల్లూరు ప్రాంతాలలో పలు దొంగతనాలు చేశారని ఈ క్రమంలో కన్నా రేణుక, ఎడ్ల సంధ్య లు పరిచయం కాగా వారిద్దరితో ఒకరికి తెలవకుండా మరొకరితో కల్పి ఉండేవాడను. కన్నా రేణుకను తీసుకొని మహబూబాబాద్ కు వచ్చి బస్టాండ్ దగ్గర ఒక రూమ్ కిరాయికి తీసుకొని ఉంటూ రామచంద్రాపురం కాలనీ లో ఒక దొంగతనం చేసడని . ఆ తరువాత రూమ్ ఖాళీ చేసి ఈదులపుసపల్లి లో ఒక ఇల్లును కిరాయికి తీసుకొని అక్కడ రేణుక తో కలిసి ఇంటి ఎదురుగా ఉన్న ఇంటిలో దొంగతనం చేసినారనీ. ఆ తరువాత మహబూబాబాద్ లోని నందన గార్డెన్ దగ్గరలోని గోపాలపురం లో ఒక ఇంటిలో దొంగతనం చేసి వారిలో కొన్ని కేసముద్రం మహబూబాబాద్ లోని ముత్తూట్ ఫైనాన్స్ లో కుదువపెట్టి డబ్బులు తీసుకొని వారి ఖర్చులకు వాడుకున్నారు. ఈ క్రమంలో ఎడ్ల సంద్యను ప్రిగ్నెట్ కావడం తో పెండ్లి చేసుకున్నాడనీ ఆ తరువాత హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక ఇంటిలో శివ శంకర్ ఎడ్ల సంద్య కు వరుసకు తమ్ముడైన ఎడ్ల సుమన్ తో కలిసి ఒక దొంగతనం చేసినాడనీ. మళ్ళీ కొత్తగూడెం వెళ్లి అక్కడ ఒక బండి దొంగిలించుకొని దానిపై ఈ రోజు దొంగిలించిన బంగారు, వెండి వస్తువులను వరంగల్ లో అమ్ముటకు పోతు దొరికాడనీ తెలిపారు . ..ఈ సందర్భంగా జిల్లాలో మేడారం వెళ్ళే భక్తులు ఇంటివద్ద బంగారు వస్తువులను నగదు ను జాగ్రత్త చేసుకోవాలని అనుమానస్పద వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కేసులలో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న టౌన్ రూరల్ సీఐ . రమేష్, సిబ్బందిని రివార్డ్ లతో అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్సైలు సి సిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

