ముఖ్యమంత్రి నీ కలిసిన రామ్మోహన్….
బి అర్ ఎస్ కు వరుస షాక్ లు ఇస్తున్న నేతలు…
ఉమ్మడి వరంగల్ జిల్లా లో గిరిజన నేతల లైన్
THOVVA WEB NEWS.//11.FEB.SUN*

గులాబీ పార్టీ అసెంబ్లీ ఓటమి నుంచి మొదలు కోలుకోలేని వరుస దెబ్బలతో ఉక్కిరి బిక్కిరి అవనుందా..!
పార్టీ కొసం నమ్మకంగా పనిచేసినవారే నేడు వరుసగా పార్టీ వీడటనికి సిద్దాపడుతున్నరా.?ఇక ఇప్పటికే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఇటీవలే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఆ తర్వాత జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవలే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. త్వరలోనే వారు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు మహేందర్ రెడ్డి సతీమణి తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ కి వరుస షాక్లు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు వరుస కట్టి పార్టీని వీడుతున్నారు. కేటీఆర్ అనుచరుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యమ శిష్యుడిగా వున్న జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పార్టీ వీడి కాంగ్రెస్ లోకి వెళుతున్నట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న బొంతు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం..
ఇది ఇలా ఉంటే ఇక ఇప్పటికే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఇటీవలే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఆ తర్వాత జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవలే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. త్వరలోనే వారు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు మహేందర్ రెడ్డి సతీమణి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య.మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యే లు చేరనున్నట్లు తెలుస్తుంది.వరంగల్ జిల్లాలో కీలక భూమిక పోషించిన గిరిజన నేత ఒకరు ఇప్పటికే ముఖ్య మంత్రి తో టచ్ లోకి వెలినట్టు తెలుస్తుంది.పార్లమెంట్ ఎన్నికల వరకు బి అర్ ఎస్ బలోపేతం కాకుంటే ఈ వలుసలు మరింత పెరిగే అవకాశం వుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సంసిద్ధత వున్న దరిమిలా రూరల్ ఏరియాలో మండల గులాబీ నేతలు పార్టీ వీడే అవకాశం మెండుగా ఉంది ఉమ్మడి ఓరుగల్లు లో ఈ తకీడి మరింత పెరగనుంది.