29 మంది వార్డు కౌన్సిలర్ సంతకలు…
Thovva web news.12.feb.mon

మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీకి మున్సిపాలిటీ లో భారీ షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ ను గద్దె దించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగనే మున్సిపాలిటీ ల పై దృష్టి పెట్టిన పార్టీ నాయకులు తమకు అనుకూలంగా వున్న మున్సిపాలిటీ లను కైవసం చేసుకోవడానికి సిద్ధమయ్యారు దానిలో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ లో చైర్మన్ వైస్ చైర్మన్ ల పై అవిశ్వాసం పెట్టలకున్నపట్టీకి రాజకీయ సమీకరణాలు మారి కేవలం వైస్ చైర్మన్ పై పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. దానిలో బాగంగా సోమవారం అధికార ప్రతిపక్ష నేతలు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం ఫ్లోర్ లీడర్ సుర్ణపు సోమయ్య. బి అర్ఎస్ నాయకులు మర్నెని వెంకన్న మాట్లాడుతూ వైస్ చైర్మన్ ఫరీద్ తన పదవి కాలంలో ఏనాడూ వార్డ్ కౌన్సిలర్ల లను సమన్వయం చేసుకోలేదని అభివృద్ధి విషయంలో పట్టించుకోలేదని 29 మంది వార్డు కౌన్సిలర్ల ముక్కుముడిగా సంతకాలు పెట్టి కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.