4రోజులు 1100 కిలోమీటర్లు… ఫిబ్రవరి 22,స్వామి దర్శనం.
బలరాముని చుసేవరకు దీక్ష.
Thovva web news. in 18 feb Sunday.

ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య బాల రాముని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. వివిధ మార్గాల్లో అయోధ్యకు చేరుకుంటూ రామయ్యను దర్శించుకుంటున్నారు. కొంతమంది స్వామి ని చూడటమే జీవిత పరమార్ధం అంటు ఉపొంగి పోతున్నారు.కలిసి నడకన బస్సులో వస్తూ బలరాముని దర్శనం తో ఉపొంగిపోతున్నరు అయితే రాజస్థాన్లో ఉదయ్పుర్కు చెందిన ఇద్దరు యువకులు శ్రీరాముడి దర్శనం కోసం సైకిళ్లపై అయోధ్యకు బయలుదేరారు.
ఉదయ్పుర్కు చెందిన జితేంద్ర పటేల్, రిషబ్ జైన్ రామ్లల్లాను దర్శించుకునేందుకు శనివారం బయలుదేరారు. ఉదయం 5:15 గంటలకు ఫతే పాఠశాలలో ఉన్న బాలాజీ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత, శ్రీరాముడిని స్తుతిస్తూ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వీరిని ఉదయ్పుర్ సైక్లింగ్ క్లబ్ సహా పలువురు స్థానికులు ప్రోత్సహించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
జితేంద్ర పటేల్, రిషబ్ జైన్రామయ్య దర్శనమే అతిపెద్ద అవార్డు!
ఈ సైకిల్ యాత్ర ఎలాంటి అవార్డు కోసం చేపట్టడం లేదని సైక్లిస్ట్ జితేంద్ర పటేల్ తెలిపారు. రామ్లల్లా దర్శనమే తమకు అతిపెద్ద అవార్డు అని తెలిపారు. తమలో ఉన్న భక్తిభావమే అయోధ్యకు సైకిల్పై వెళ్లేలా చేసిందని రిషబ్ జైన్ తెలిపారు. 500 ఏళ్ల నిరీక్షణ ముగిసిందని, భక్తుడిలా దర్శనం కోసమే అయోధ్యకు వెళుతున్నట్లు రిషబ్, జితేంద్ర చెప్పారు.
నాలుగు రోజులు- 1100 కి.మీ
ఉదయ్పుర్ నుంచి అయోధ్యకు 1100 కిలోమీటర్లు కాగా, నాలుగురోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు జితేంద్ర, రిషబ్. ఫిబ్రవరి 22వ తేదీన వీరిద్దరూ బాలక్ రామ్ దర్శించుకునే అవకాశం ఉంది. మొదటి రోజు ఉదయపుర్ నుంచి కోటా వరకు 300 కి.మీ, రెండో రోజు కోటా నుంచి శివపురికి 230 కి.మీ, శివపురి నుంచి కాన్పుర్ వరకు 327 కి.మీ, నాలుగో రోజు కాన్పుర్ నుంచి అయోధ్య వరకు 220 కి.మీ సైక్లింగ్ చేయనున్నారు.
దేశమంతా శ్రీ రామమయమే తమ ఆశయం గా జీవిస్తున్నారు మరి కొంత మంది భక్తులు..