కారులో వచ్చి “ఏటీఎం “చోరీ…
Thovva web news.in//
18.Feb.Sunday

మహబూబాబాద్ జిల్లాబయ్యారం మండల కేంద్రం లోని ఎస్.బి.ఐ , ఏ.టి.ఎం లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.శనివారం అర్ధరాత్రి కారులో వచ్చిన కొంత మంది వ్యక్తులు గ్యాస్ కట్టర్ తో ఏ.టి.ఎం మిషన్ ను ద్వంసం చేసి భారీ మొత్తంలో నగదు ను అపహరించుకొనిపోయారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీ క్లూస్ టీమ్ తో సంఘటన స్థలానికి చేరుకొని … సిసి ఫుటేజ్ లను చూస్తూ విచారణ చేపట్టారు. కాగా ఈ శుక్రవారం సాయంత్రం ఈ ఏటీఎం లో29 లక్షల రూపాయలను పెట్టినట్లు సమాచారం. ఈ విషయంపై అడిషనల్ ఎస్పీ చెన్నయ్య మాట్లాడుతూ….. అర్ధరాత్రి కారులో నలుగురి నుంచి ఐదుగురు వ్యక్తులు వచ్చి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం ధ్వంసం చేసి 25 నుంచి 30 లక్షల వరకు చోరీ చేశారని, వీరంతా ప్రొఫెషనల్ గ్యాంగ్ కు సంబంధించిన వారిని, త్వరలోనే పట్టుకొని సొమ్మును రికవరీ చేస్తామని , మేడారం జాతరను పురస్కరించుకుని ఇల్లల్లకు తాళాలు వేసి వెళ్తారని, విలువైన బంగారు వస్తువులు ,డబ్బులను ఇంట్లో ఉంచుకోవద్దని , మేడారం జాతరలో కూడా మహిళలు జాగ్రత్తగా ఉండాలని ప్రజల విజ్ఞప్తి చేశారు.