ఎస్ఎఫ్ఐ వీరబాబు డిమాండ్
తొవ్వ న్యూస్. ఇన్.నర్సింహులపేట ఫిబ్రవరి 20.
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నర్సింహులపేట మండలం కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ బాయ్స్ హాస్టల్ విద్యార్థుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ వీరబాబు మాట్లాడుతూ నర్సింహులపేట మండలంలో ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో స్థానికంగా హాస్టల్ వార్డెన్ లేకపోవడం వల్ల బిక్కుబిక్కుమని గడుపుతున్న విద్యార్థులు రాత్రి వేళలో పాము కరిచిన తేలు కరిచిన జ్వరం వచ్చిన చెప్పుకోవడానికి వార్డెన్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి మెనూ ప్రకారం విద్యార్థులకు ఇవ్వకపోవడం వల్ల తీవ్ర అన్యాయం చేస్తున్నాడు వార్డెన్ అని ఎస్ఎఫ్ఐ వీరబాబు డిమాండ్ చేశారు కనీసం చుట్టం చూపులాగా కూడా జిల్లా ఉన్నత అధికారులు విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం కోసం కనీసం చొరవ చూపకుండా వ్యవహరిస్తున్నారు పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఎస్సి హాస్టల్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ వీరబాబు డిమాండ్ చేశారు లేనియెడల విద్యార్థులు అందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నిఖిల్ ప్రణయ్ సందీప్ సాయి శివ వంశీ పృద్వి హాస్టల్ విద్యార్థులు చరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు