చెరువులు కుంటలు వద్ద సైన్ బోర్డులో ఏర్పాటు చేయలి..
గ్రీన్ లాండ్ భూములను పరిరక్షించాలి….
మలి దశ ఉద్యమ నాయకులు.కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షులు.i ఘనపురం అంజయ్య

అన్యాక్రాంతమైన ప్రభుత్వ చెరువులు కుంటలు భూములకు రక్షణ కల్పించాలని చెరువులు వివరాలు విస్తీర్ణం తెలిపే విధంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఘనపురం అంజయ్య అన్నారు. సోమవారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తుమహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్యాక్రాంతమైన చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అధ్వైత్ కుమార్ సింగ్ రికార్డులు పరిశీలించి రెవెన్యూ, ఇరిగేషన్, ల్యాండ్ సర్వే, మున్సిపల్ అధికారుల చేత హద్దులు నిర్ణయించి ప్రభుత్వం తరపున సర్వే నెంబర్లతో హెచ్చరిక బోర్డులతో పాటు భూముల వివరాలు విస్తీర్ణం ప్రజలకు తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.రియల్ ఎస్టేట్ కమర్షియల్ ప్లాట్ల కోసం నాలా కట్టి లే అవుట్ చేసిన భూములకు గ్రీన్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలించి బోర్డులు పెట్టాలని గ్రీన్ ల్యాండ్ లేని వాటికి తక్షణమే స్పందించి నిబంధనల మేరకు గ్రీన్ ల్యాండ్ తీయాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజా పాలనలో పూర్తి పారదర్శకంగా అధికారులు ప్రజలకు పూర్తి జవాబుదారీ పాలన అందించాలని సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ ధరఖాస్తులు పట్టుకుని ప్రజలు తిరగకుండా చూడాలని నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాలు ప్రభుత్వ భూములు కబ్జాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని గతంలో అన్యాక్రాంతమైన భూములు తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాలని ఎవరైనా కబ్జాలకు పాల్పడినట్లు రుజువైతే కఠినంగా శిక్షించాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నారని ఇదే ప్రజాపాలన కు నిదర్శనమని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి వారి అవసరాలు తీర్చే భాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం కోసం ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారి వివరాలు పరిశీలించి అర్హులైన అందరికి ఇంటి స్థలం ఇంటి నిర్మాణం మంజూరు కోసం అనుమతులు ఇవ్వాలని అన్నారు.