ఎమ్మెల్యే ఆదేశాలతో పరిశీలించిన అర్బన్ కాంగ్రెస్ పార్టీ……
ఘనపురం అంజయ్య ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయి పరిశీలన
తొవ్వ వెబ్ న్యూస్.ఇన్ 29 ఫిబ్రవరి గురువారం

గత పాలకుల నిర్లక్ష్యంతో మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందాగా మారిన క్రమంలో మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనపురం అంజయ్య అధ్యక్షతన పలు పనుల పురోగతి పై క్షేత్ర స్థాయి సందర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఘనపురం అంజయ్య మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు ఇతర ముఖ్య నేతలు మాట్లాడుతూమహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ ఆదేశాల మేరకు పట్టణంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం పరిశీలించడం జరిగిందనిఏటిగడ్డ తండ వాటర్ ట్యాంక్ దగ్గర ఫిల్టర్ బెడ్ ట్యాంకులు పరిశీలించమని అర్భన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర రోడ్డు విస్తీర్ణం లో భాగంగా తీసివేసిన మహానీయులు స్వామి వివేకానంద కొమరం భీమ్ విగ్రహాలు అక్కడ పక్కన పడేసినారని విగ్రహాలు పరిశీలించి వాటినిపునః ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించినట్లు తెలిపారుఅలాగే పట్టణ పరిధిలోని 36 వార్డులలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని సానిటేషన్ అస్తవ్యస్తంగా వున్నట్టు గుర్తించామని మున్సిపల్ పాలకవర్గం నిద్రపోయినట్లు ఉంటుందని గతంలో ఉన్న బిఅర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ పేరిట పట్టణంలో రోడ్లను తవ్వి డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని వెంటనే సమస్యలు పరిష్కరించాలని వాటర్ ట్యాంక్ లు మనుగడలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు .సమస్యలపై వినతి పత్రం ను మున్సిపల్ కమిషనర్ కు అందించారుఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా నాయకులు మాజీ జడ్పీటీసి జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, TPCC ఎస్టీ సెల్ కో ఆర్డినేటర్ గుగులోత్ వెంకట్ నాయక్, జిల్లా నాయకులు కాట భాస్కర్, TPCC ఒబీసీ సెల్ జాయింట్ కో ఆర్డినేటర్ పిండ్రాల రాందాస్, ఆవుల సతీష్, జాకీర్ హుస్సేన్ర చంద్రశేఖర్, బొళ్లు రాజు, బండారు చిరంజీవి, తోట యాకయ్య, అసిఫ్ బాయ్, భాస్కర్, పిల్లి కృష్ణ, నెమ్మది సుదర్శన్, అలీమ్ బాయ్, పడిశాల వెంకన్న, జావేద్, పాషా, అమీర్, నజీర్, ముఖీద్, సాబీర్ హుస్సేన్, సలీమ్ తథితరులు పాల్గొన్నారు.

