తొవ్వ న్యూస్. ఇన్ / నర్సింహులపేట మార్చి.01.2024.

నర్సింహులపేట మండలం లోని లోక్యతండా గ్రామం లో వరి పొలాలను సందర్శించడం జరిగింది.
రైతులకు వరిలో యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు.ప్రస్తుతము వరిలో మొగి పురుగు ఆశించడం జరుగుతున్నందున . చదరపు మీటర్కు నాలుగు నుంచి అయిదు కుదుళ్లకు మోగి చనిపోయినట్లు గమనించిన వెంటనే పిచికారి చేసుకోవాలని దీని నివారణకు కార్టాప్ హైడ్రా క్లోరైడ్ 2గ్రాములు లీటర్ నిటికి కలిపి పిచికారి చేసుకోవాలి.మరియు వేప నూనె 5ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని జింకులోప నివారణకు చిలేటెడ్ జింక్ సల్ఫేట్ 2 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలననీవరిలో అగ్గితెగులు నివారణకుట్రై సైక్లోజోల్ 1గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని ఏవో రామకృష్ణ రైతులకు సూచించారు.ఈ కార్యక్రమం లో ఏవో రామకృష్ణ తో పాటు ఏఈఓ లు మరియు రైతులు లింగాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.