ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవ ముగింపు వేడుకలు
_పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవ కమిటీ బాద్యులు,
ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు…
Thovvaweb page news.
తొర్రూరు మార్చ్ 02..

గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్, సమాజ ఉన్నతిలో సేవాలాల్ మహరాజ్ సేవలు మరవులేనివనీ పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.శనివారం పాలకుర్తి మండల కేంద్రంలో ఘనంగా బోగ్ బండారో కార్యక్రమం నిర్వహించారు ముందుగా భారీ స్వాగత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా, ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి_ తో పాటుగాప్రభుత్వ విప్ డోర్నకల్ శాసన సభ్యులు డా, రామచంద్రు నాయక్ , వరంగల్ డీసీసీ అధ్యక్షులు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ , పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డిహాజరై సేవలాల్ మహారాజ్ సేవలు కొనియాడారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి మాట్లాడుతూ గిరిజన సామాజిక వర్గం అభివృద్దిలో సంత్ సేవాలాల్ మహారాజ్ పాత్ర చాలా కీలకం నిజాం సామ్రాజ్యాన్ని తన ఆధ్యాత్మిక శక్తితో గడగడా లాడించి పేరీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన క్రాంతివీరుడు సేవాలాల్ మహరాజ్ అని అన్నారు_
బంజారా ప్రజలు అత్యంత విశ్వాసం పాత్రులు అని బంజారా ప్రజల్లో అత్యధిక మంది గూఢచార వ్యవస్థలో పనిచేసేవారు అని నిజాం సామ్రాజంలో గోల్కొండ కోటలో ప్రవేశించాలంటే భారీ తనిఖీల నడుమ లోపేట ప్రవేశానికి వదిలే వారు, వాటిలో ఒకటి ధార్వాజ పేరును బంజారా ధార్వాజగా పేరు పెట్టి ఎటువంటి తనిఖీలు నిర్వహించకుండా కోటలోనికి కేవలం బంజారా ప్రజలకు మాత్రమే ఇ అవకాశం ఉండేది అని అంతటి నమ్మకస్తులు ఈ బంజారా ప్రజలు అని కొనియాడారుబంజారా ప్రజలు విద్య, వైద్య, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రంగంలో ముందుకు సాగాలని సూచించారు.ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆరూ గ్యారెంటీలను అమలు చేస్తాం అని, ప్రజల నమ్మకాన్ని కాపాడకుంటామని తెలిపారు, గత ప్రభుత్వంలో గిరిజనులకు అన్యాయం జరిగింది అని, మా ప్రభుత్వంలో ప్రత్యేక శ్రద్ధ చూపి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తామని తెలిపారుఅనంతరం: ఉత్సవాల్లో పాల్గొన్న అతిథిలకు మెమోటోలు అందజేశారు
ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ శ్రేణులు, గిరిజన సంఘాల నాయకులు, సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు
