సదుపాయాల లేమి తో ఇబ్బందుల గురవుతున్న చిరు వ్యాపారులు….
పార్కింగ్ వసతి లేక ట్రాఫిక్ కష్టాలు….. గోదాములు లేక వ్యాపారుల అవస్థలు
– లక్షల రూపాయలు నిధులు ఉన్న దుర్వినియోగం..
– పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు..
సంత అభివృద్ధి చేస్తే గ్రామ పంచాయతీకి శాశ్వత నిధుల
తొవ్వ ప్రత్యేక కథనం నర్సింహుల పేట



సంతా మా ఊరి సంతా.. వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా.. అన్నట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో వారాంతపు సంతలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. ఎక్కడ సంత ఉంటే అక్కడ నిత్యావసరాలు, వస్తువులు విక్రయిస్తూ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. గది అడ్వాన్స్, అద్దె వ్యాపార వాణిజ్య పన్నులు, విద్యుత్ బిల్లుల భారం లేకపోవడంతో చాలామంది వ్యాపారులు వారాంతపు సంతలకే మొగ్గు చూపుతున్నారు. ప్రజలకు కూడా దూరభారంతోపాటు వ్యయప్రయాసలు తప్పుతుండటంతో ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా సంతలు జనంతో కిక్కిరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పశువుల సంత మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ప్రతి శనివారం జరుగు సంతకు అనాది కాలం నుండి గొర్లు, మేకలు పశువులు, నిత్యవసర వస్తువులు, కూరగాయలను చిరు వ్యాపారులు, రైతులు తీసుకొని వచ్చి సంతలో అమ్ముకొని వెళతారు. సంత వచ్చిందంటే నర్సింహులపేట గ్రామ ప్రజలే గాక ఇతర ప్రాంతాల వారు వచ్చి సరుకులు కొని తీసుకొని వెళతారు. రోజు రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, మార్పు జరుగుతున్నప్పటికీ నర్సింహులపేట సంత మాత్రం ఏమాత్రం అభివృద్ధి చెందడం లేదు. సంతలో చిరు వ్యాపారులు, రైతుల వద్దనుండి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వేల పాట పెట్టగా ఈ సంవత్సరం రూ.13,60,000/- ఆదాయం వచ్చింది. కాంట్రాక్టర్లు డబ్బులు వసూలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామపంచాయతీ డబ్బులు వసూలు చేస్తూ, పంచాయతీ నిధులు పుష్కలంగా పెరుగుతున్నప్పటికీ చిరు వ్యాపార, రైతుల బాగోగులు చూసే పరిస్థితి లేదని, కూరగాయలను, నిత్యవసర వస్తువులు రోడ్డు మీదనే పెట్టి అమ్ముకోవడం జరుగుతున్నదని, సంతలో వ్యాపారం చేసుకునే వారికి మరుగుదొడ్లు వున్నా ట్యాంకులో నీరు నింపే వారు కరువయ్యారని, వాడకం లేని మరుగు దొడ్లకి వేళ్ళకుండా అడ్డుగా దుకాణం ఏర్పరచుకొని వ్యాపారం చేస్తున్నారని, ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు వ్యాపారాలు చేసుకునే మహిళలు, పురుషులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై వాహనాల రద్దీ పెరగడం, రోడ్ల మీదనే సరుకులు పెట్టి అమ్ముకోవడం వల్ల సరుకులు కొనుక్కునే వారికి మరియు చిన్న తిరుపతి గా పేరు గాంచిన దేవస్థానములకు వెళ్ళే భక్తులకు మండల కార్యాలయాలకు వచ్ఛే వారితో పాటు పాఠశాల విద్యార్థులకు,వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందిగా ఉందని గ్రామ ప్రజలు అంటున్నారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్న్యాయ ఏర్పాట్లు చేసి సంతలో స్థలం కేటాయించి వారికి తాత్కాలికషెడ్ లను ఏర్పాటు చేసి వారికి కేటాయించడం వల్ల అమ్మకం దారులకు, కొనుగోలుదారులకు మేలు చేసిన వారవుతారని, వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని, వర్షా కాలంలో అంతా బురదమయమై సరుకులు కొనే పరిస్థితి కూడా ఉండదని వాసనతో కంపు కొడుతూ ఉండడంవల్ల గ్రామ ప్రజలు నిరుత్సాహానికిలోని విధిలేని పరిస్థితుల్లో సరుకులు కొనుక్కోవడం జరుగుతుందని అన్నారు. గ్రామపంచాయతీ చిరు వ్యాపారులు, రైతుల నుండి 50 రూపాయల నుండి 100 రూపాయలు వరకు రుసుము వసూలు చేస్తున్నప్పటికీ వారికి తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయకపోవడం విచారకర మని, ఇప్పటికైనా షెడ్లను ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యాన్ని కలిగించాలని వినియోగదారులు, అమ్మకందారులు కోరుతున్నారు. గ్రామపంచాయతీ తక్షణమే బాధ్యత తీసుకొని తగిన ఏర్పాటు చేస్తారని మండల ప్రజలు కోరుతున్నారు. వెంకటేశ్వర స్వామి గుడి కి పోయే దారిలో ప్రతి శనివారం భక్తులకు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆ సంత లో భక్తులు పోవాలని అనుకుంటే గంటల పాడి వెయిటింగ్ చేయవలసి వస్తుంది. కావున అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే రోడ్డు పై పెట్టిన కూరగాయలను వెడల్పు చేయాలని మండల ప్రజలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
సంత అభివృద్ధికి చర్యలు చేపట్టాలి..
సంతలో అన్ని కష్టాలే ప్రతి శనివారం సంతలో వ్యాపారులకు ప్రజలకు చాలా ఇబ్బందులు గురవుతున్నారని వెంకటేశ్వర స్వామి గుడికి పోవాలన్న గంటలపాటు ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని మండల అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వలన రోడ్లపై కూరగాయలు రైతులు మేకలు బర్లు రోడ్లపై ఉండడం వలన అంతరాయం జరుగుతుందని అధికారులు స్పందించి సంతను వేరే మార్గంలో తరలించాలని అధికారులను వ్యాపారస్థులు మరియు వివిద గ్రామాల ప్రజలు కోరుతున్నారు.వ్యాపారస్థులు మాట్లాడుతూ ప్రతి శనివారం జరిగే సంతలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం నీళ్ల వసతి లేక పశువులకు గొర్లకు నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు గ్రామపంచాయతీ కార్యాలయంలో కొన్ని లక్షల రూపాయలు నిధులు ఉన్న వాటిని పట్టించుకోక పోవడం వలన వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతిని స్పందించి సంతను వేరే కాడికి మార్చాలని తమ ఆవేదన వ్యక్తం చేశారు.మండల కేంద్రంలో సామాన్య కుటుంబాలకు అందుబాటులో ఉండే వారాంతపు సంత అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఇరుకైన దారుల నుంచి మార్చి సొంతంగా విశాలంగా ఉండే స్థలాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా వ్యాపారులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ముఖ్యంగా వీధి దీపాలు మరుగుదొడ్లు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ఇలా చేయడం వల్ల గ్రామ పంచాయతీకి కూడా లాభం వస్తుందని శాశ్వతంగా నిధులు సమకూర్తాయని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం
