ఘనంగా చండీ హోమం,అష్టోత్తర శతకళాశాభిషేక పూజా నిర్వహణ
వైభోపేతంగా శివపార్వతుల కల్యాణం
భక్తులతో కిటకిటలాడిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయం
తొవ్వ న్యూస్. ఇన్ నర్సింహులపేట, మార్చి.08.2024

మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ప్రసన్నాంజనేయ స్వామి 18వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శివపార్వతుల కళ్యాణం కమనీయంగా సాగింది. శుక్రవారం తెల్లవారు జామునుండే అభిషేకములు,అర్చనలు,పూజా కార్యక్రమాలతో భక్తులు బారులు తీరారు.108 కళశాలు,35 రకాల సుగంధ ద్రవ్యాలతో మహారుద్రాభిషేకము,చండీ హోమం,పూర్ణాహుతి నిర్వహించారు.సాయంత్రం 8 గంటలకు మేళ తాళాలతో సాదరంగా శివపార్వతుల ఉత్సవ విగ్రహాల దాతలు ఎడ్ల మంజుల మల్లారెడ్డి,న్యాలకొండ మన్విత రాహుల్ రెడ్డి,గూడూరు పద్మ కనకం అమ్మవారిని స్వామివారిని తీసుకువచ్చారు.తధానంతరం వేద పండితులు పోలకొండ వెంకన్న ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణాలు, భక్తుల శివ నామస్మరణల మధ్య కళ్యాణం నిర్వహించారు.మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.అనంతరం శాశ్వత కళ్యాణ దాతలకు పట్టు వస్త్రాలు,తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన నిర్వాహకులు అన్నావజ్జుల సూర్యప్రకాష్ శర్మ, ప్రధాన అర్చకులు దేవేంద్ర శర్మ,దాతలు ఇట్టి మంగమ్మ నరేందర్ రెడ్డి,హైదరాబాదుకు చెందిన దారం ప్రీతి సుమన్,శ్రీ మంచాల సుజాత యుగంధర్,ఎదల్ల జ్యోతి రవీందర్ రెడ్డి,ఖమ్మం పట్టణానికి చెందిన దొంతగాని రవళి వాసు,స్టేషన్ ఘన్ పూర్ లో ఏ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ వాణిశ్రీ, పెద్దనాగారం గ్రామానికి చెందిన ఉల్లి సునీత శ్రీనివాస్,బాస్ తండ పంచాయతీ కార్యదర్శి రామగిరి మౌనిక,బొల్లం కళావతి రమేష్, సిరి ఫోటో స్టూడియో సంతోష్ శిరీష లతో పాటు మండల ప్రజలు భక్తులు తదితరులు ఉన్నారు.