రాజీవ్ యూత్ అసోసియేషన్ అధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం
ప్రారంభించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రు నాయక్
తొవ్వ న్యూస్.ఇన్ నర్సింహులపేట మార్చి08.


క్రీడలతో మానసిక ఉల్లాసం మరియు ప్రశాంతత లభిస్తుందని డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రములో రాజీవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని తెలంగాణ క్రీడా మైదానం లో ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల స్థాయిలో మూడు రోజులు జరిగే కబడ్డీ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు మండల పాలకులతొ కలసి కబడ్డీ పోటీలు ఎమ్మెల్యే ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి జెండావిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతు క్రీడలతో యువకులు స్నేహాభావం పెంచుకునే వేదిక అలాగే ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుంది గెలుపు ఓటములు ఎలా ఉన్నా వ్యక్తిలోని నైపుణ్య ప్రతిభను వెలుకితీసే అవకాశం మాత్రం కలుగుతుంది అన్నారు.క్రీడలను వల్ల మనోవికాసం పనిలో ఒత్తిడికి గురియై వారు గ్రౌండ్ లోకి వెళ్ళి ఎదో ఒక ఆట ఆడితే ఒత్తిడి నుంచి రికవరి అవుతారు.యువతకు చదువు తో పాటు క్రీడల మీద దృష్టించాలని కోరుకుంటూ అలాగే యువత ముఖ్యంగా చెడు అలవాట్లు దూరంగా ఉండాలి. గంజాయి వంటి మత్తు పదార్థాలకు ముఖ్య చాలా దూరంగా ఉండాలి గంజాయిని చుట్టుపక్కల కూడా ఎవరైనా సేవించిన కాని అమ్మిన కాని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వారు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలోరాజీవ్ యూత్ అసోసియేషన్ నిర్వహకులు దోమల యాదగిరి, కసా యకన్న, గౌనీ యాదగిరి పొన్నం శ్రీకాంత్ అనిల్ కుమార్ యాదవ్ ఎండీ మునవిర్ దోమల యకశ్వమి క్రాంతి రెడ్డి పెద్ద మల్ల యకస్వమి వెంకటేష్ సోమేష్ రఘు వీరన్న కొంపల్లి యికన్న అవుల మహేష్ నిమ్మల శ్రీను దిలీప్ ఎంపీటీసీ అనూరాధ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రజినీ కాంత్ రెడ్డి అలువల శ్రీనివాస్ రమేష్ జైపాల్ రెడ్డి కడుధుల రామకృష్ణ ధశ్రు నాయక్ యెల్ల రెడ్డి వెంకట్రాం నర్సయ్య, బండ శ్రీనివాస్ రెడ్డి బానొత్ దశ్రు, రిఫరిస్ ప్రవీణ్ రెడ్డి భద్రయ్య కొమురయ్య శ్రీను వెంకటేష్ శేంకర్ నాయక్ మరిపెడ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.