ప్రొఫెసర్ పేరును ప్రకటించొద్దని నేతలు “గుర్రు”…
క్యాడర్ లేని నేతలను తెచ్చి తమపై రుద్దొద్దు…
వర్గాలుగా విడిపోతున్న ఆదివాసీలు గిరిజన లంబడలు….
బిఆర్ఎస్ కాంగ్రెస్ కు సరైన పోటీ ఇవ్వాలని అధిష్టానం కు వినతి…
దేశమంతా మోడీ , కాషాయం ప్రభంజనం వున్న మహబూబాబాద్ లో మాత్రం వర్గ పోరు…..
సీతారాం నాయక్ అభ్యర్థి గా ప్రకటించవద్దంటున్న పార్లమెంట్ నియోజకవర్గ కమలం నేతల పోరు
తోవ్వ వెబ్ న్యూస్.ఇన్, మార్చ్ 09 శనివారం…

దేశమంతా మరోసారి కమలం సర్కార్ రావాలని …. నమో…. మంత్రం జపిస్తు వాజపేయి ఆకాంక్ష సుస్థిర ప్రభుత్వం రావాలంటే 400 సీట్లు గెలిచి ప్రభంజనం సృష్టించాలని చూస్తుంటే దానిలో భాగంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అయినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రాష్ట్రంలో మెజార్టీ సీట్లను సాధించి మోడీకి బహుమతిగా ఇవ్వాలని ఆయా రాష్ట్రాల అధ్యక్షులు నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోన గెలుపు గుర్రాలను ఎంచుకొని. రంగంలోకి దింపాలని ఇప్పటికే తెలంగాణలో 9 పార్లమెంటు సీట్లు ప్రకటించి బిజెపి ప్రచారంలో ముందుకి సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా లోని మహబూబాబాద్ వరంగల్ పార్లమెంట్ లకు బలమైన నేతలను ఎంచుకొని పార్లమెంట్ లను కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబాబాద్ లో మాజీ ఎంపి కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ పేరు తెరమీదకు తెస్తున్నారు. మహబూబాబాద్ ఎస్టి పార్లమెంట్ నియోజకవర్గం లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకటి జనరల్ కాగా మిగిలినవి 6 ఎస్టీ నియోజకవర్గాలు ఈ నియోజకవర్గంలో భాజపా బలం అంతంత మాత్రమే ఆదివాసీలు లంబడాలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గాల్లో లంబాడీలు తక్కువగా ఆదివాసీల ఎక్కువగా వున్నప్పటికీ ఆర్థిక రాజకీయ చైతన్యం లో లంబాడీలు ముందున్నారు. మహబూబాబాద్ లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాజపా తన బలాన్ని పుంజుకొని 2014 ఎన్నికల సమరంలో నిలిచింది 2019లో జరిగిన ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి హుస్సేన్ నాయక్ బరిలో నిలిచి కాంగ్రెస్కు టిఆర్ఎస్ కు గట్టి పోటీనే ఇచ్చారు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుస్సేన్ నాయక్ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడి ఓటమి చెందడంతో ఆయనకు జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్ హోదాలో సభ్యుడిగా చేర్చుకుని మహబూబాబాద్ పార్లమెంటుకు కొత్త నాయకుని రంగంలో దించాలని భాజపా అధిష్టానం నిర్ణయించింది ఈ సందర్భంగా మాజీ ఎంపీ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఈ స్థానం నుంచి పోటీలో ఉంచాలని అందుకు క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తునట్టు తెలుస్తుంది.ఇక ప్రొఫెసర్ ఈ సీటు తనదే అని ఊవ్విల్లురుతున్నారు. అందుకు అనుగుణంగా బి ఆర్ ఎస్ రాజీనామా చేసి కమలం గూటికి చేరుకొని మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి భాజపా అభ్యర్థిగా నిలబడాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు.భాజపా పార్టీని ఒప్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది . అయితే ఇక్కడే సరైన ట్విస్ట్ ఎదురైంది. నాయక్ సాబ్ అభ్యర్థిత్వం పై పార్లమెంట్ పరిధిలో పార్టీ నేతలు నాయకులు ప్రొఫెసర్ అభ్యర్థిని నిరాకరించడం. చర్చనీయాంశంగామారింది.గతంలో పార్టీ కోసం కష్టపడి సీటు కోసం ఆశపడిన నేతల్లో ఆదివాసి గిరిజన మోర్చా రాష్ట్ర జిల్లా నాయకులు ఎంతో మంది వున్నామని భాజపా పార్టీని క్షేత్ర స్థాయిలో తీసుకొని వెళ్లి గ్రామ గ్రామాన శక్తీ కేంద్రాలు ఏర్పాటు.యువ స్థితి మీటింగ్ లు పెట్టి పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని కొత్త వారికి సీటు ఎలా ఇస్తారని వాపోతున్నారు.ఇప్పటికే. తమకు అభ్యర్థి గా అవకాశం వుంటుందని ఊహించుకున్న నాయకులు ,యాప సీతయ్య, డాక్టర్ విజయలక్ష్మి, హుస్సేన్ నాయక్ ,లింగయ్య దొర ,ప్రహాలద్ నాయక్ , సుస్మిత రాథోడ్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీరిని కాదని కొత్తగా వచ్చిన సీతారాం నాయక్ ఎలా ఇస్తారని ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు .అంతేకాకుండా ప్రొఫెసర్ సొంత నియోజకవర్గమైన ములుగులో భాజాప నేతలు సహకరించమని బాహాటంగానే వీధుల్లోకి వస్తున్నారు. . గతంలో మహబూబాబాద్ పార్లమెంట్ కు తెలంగాణ కొత్త రాష్ట్రం లో ఎంపిక అయి. విభజన హామీలు ప్రస్తావించలేదని బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఆదివాసీల ఉపాధి సంక్షేమం , కనీసం ట్రైన్ లు కూడా అపించలేకపోయారనే వాదనలు తెరమీదకి తెస్తున్నారు. ఆదివాసి గిరిజనులు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ లు ఏమి చేసారో చెప్పలనీ ఆదివాసీలు లంబాడీలు ఇరు వర్గాలు ఒకింత గుర్రుమంటన్నయీ. ప్రొఫెసర్ అభ్యర్థి త్వం పై వద్దంటూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చలు చేస్తున్నారు. ఇక బిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రివర్యులు పోలిక బలరాం నాయక్ ని బరిలోకి దించి ఇరుపార్టీలు తమ సత్తా చాటు తుంటే.. దేశంలో మోడీ ప్రభంజనం నడుస్తున్న ఈ సమయంలో భాజపఅభ్యర్థిగా ప్రొఫెసర్ తట్టుకోలేడని సరైన క్యాడర్ లేని ఈ సమయం లో పార్టీని క్షేత్ర స్థాయిలో తీసుకొని వేళ్ళే భావజాలం వ్యక్తం చేసే నాయకుడు కావాలని . ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలో తిరుగుతున్న నేతలకు 7 నియోజకవర్గాల్లో వర్గ పోరు కచ్చితంగా కనిపిస్తుంది ఈ సమయంలో కొత్త నేతలతో ఓటమి చెంది అభాసుపాలు అవ్వడం ఎందుకని మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం ఇంకా సమయం వునదున్న మరో కీలక నేతలను తీసుకొని వచ్చిరంగం లోకి దింపాలని పార్టీ అభిమానులు ఆఅంటున్నారు. . ఏదేమైనా పార్లమెంట్ సీటును ప్రొఫెసర్ కు కాకుండా వేరే వారికి ఇచ్చిన తమకు అనుకూలమే అంటూ భాజపా సీనియర్ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి విన్నవించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

