ప్రభుత్వాలు మారిన అధికారుల తీరు మారదా…?
పీఎంవో, రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు వచ్చినా నో రెస్పాన్స్
మానుకోట తహసీల్దార్ తీరుపై నిరుపేద ఆక్రందన
తన భూమి ఏమైందని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు…
న్యాయం చేయాలని వేడుకోలు…
తొవ్వ వెబ్ న్యూస్. మార్చ్ 17.:

మహబూబాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో జరిగిన అక్రమాలకు అంతేలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూ మాఫియా పేట్రేగిపోయిందనీ ప్రజలు మార్పు కావాలని కోరుకోని కొత్త ప్రభుత్వం వచ్చిన అధికారుల తీరు మారలేదు. సరి కదా పాత ప్రభుత్వం లో చేసిన విధంగానే వారి ప్రవర్తన సరళి వుంది వారు చేసిన ఘన కార్యం ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలోనే ఈ ఘటన పై పోరాటం చేస్తున్న నిరుపేద దీన గాథ జిల్లా కేంద్రానికి చెందిన ఓ నిరుపేద ఇంటి స్థల వ్యవహారం. మహబూబాబాద్ జిల్లా పరిధికి చెందిన బాల్నే సుమన్ కు మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో బీపీఎల్ కోటాలో కొన్నేళ్ల క్రితం సుమారు 200 గజాలకు పైగా ఇంటి స్థలాన్ని కేటాయించారు. కాగా ఇదే స్థలాన్ని మహ బూబాబాద్ పట్టణానికి చెందిన మరో వ్యక్తికి రెవెన్యూ అధికారులు ఇంటి నిర్మాణం కోసం అనుమతులిచ్చారు. దీంతో సుమన్ న్యాయం చేయాలని తొలుత కలెక్టరేట్ గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేశాడు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాన్ని కొంత మంది వ్యక్తులు కబ్జా చేశారని కలెక్టర్ కు మొదలుకుని మాజీ సీఎం కేసీఆర్ వరకు ఫిర్యాదు చేశాడు. అసలు తనకు ఇంటి స్థలం ఉందా లేదా అని సమాచార హక్కు చట్టం ద్వారా బాధితుడే సమాచారం కోరగా ఇంటి స్థలం ప్రభుత్వం ఇచ్చిందని ధ్రువీకరిస్తూ సమాచారాన్ని అందించినట్లు సుమన్ తెలిపాడు. అయితే తనకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్లకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఎవరు చెప్పినా.. నో రెస్పాన్స్.
కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగట్లే దని, దేశ ప్రధాన మంత్రి, రాష్ట్రపతి గ్రీవెన్స్ సెల్ లో ఆధారాలతో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులపై స్పందించిన పీఎం కార్యాలయ అధికారులు, రాష్ట్రపతి భవన్ అధికారులు ఈ విషయంపై విచారణ చేసి బాధితుడికి న్యాయం చేయాలని అధికారి కంగా సంబంధిత శాఖ అధికారికి ఎండాస్ చేశారు. 2023 డిసెంబర్ లో మానుకోట తహసీల్దార్ కార్యాల యానికి పీఎంవో కార్యాలయం, రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు అందగా నేటికి సదరు సమస్య పరిష్కరించబ డలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు న్యాయం చేయాలి… మహబూబాబాద్ జిల్లా కేం ద్రంలో కోట్లాది రూపాయ ల విలువ చేసే ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో కాజేశారని బాధితుడు సుమన్ ఆరోపించాడు. నిరుపేదలకు కేటా యించిన ప్రభుత్వ భూమి (ఇంటి స్థలం) అందలేదని తెలిపాడు. ఇప్పటికైనా రాష్ట్ర యంత్రాంగం స్పందించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న భూ కబ్జాలపై విచారణ చేపట్టి, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి గ్రీవెన్స్ నుంచి వచ్చిన ఫిర్యాదుపై స్పందిం చని తహసీల్దార్ పై కఠిన చర్యలు తీసుకో వాలని కోరుతున్నాడు. ఇదిలా ఉండగా మ హబూబాబాద్ జిల్లా కేంద్రలో కొంత మం ది అధికారులు ప్రభుత్వ భూమిని ఫలహా రంగా పంచి పెట్టి లక్షలాది రూపాయలను దండుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
న్యాయం చేయాలి…..మహబూబాబాద్ జిల్లా కేం ద్రంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని తప్పడు పత్రాలతో కాజేశారని బాధితుడు బాల్నే సుమన్ ఆరోపించాడు. నిరుపేదలకు కేటా యించిన ప్రభుత్వ భూమి (ఇంటి స్థలం) అందలేదని తెలిపాడు. ఇప్పటికైనా రాష్ట్ర యంత్రాంగం స్పందించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న భూ కబ్జాల పై విచారణ చేపట్టి, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి గ్రీవెన్స్ నుంచి వచ్చిన ఫిర్యాదుపై స్పందిం చని తహసీల్దార్ పై కఠిన చర్యలు తీసుకో వాలని కోరుతున్నాడు. ఇదిలా ఉండగా మ హబూబాబాద్ జిల్లా కేంద్రలో కొంత మం ది అధికారులు ప్రభుత్వ భూమిని ఫలహా రంగా పంచి పెట్టి లక్షలాది రూపాయలను దండుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి


