19.200/- రూపాయలతో లంచం తో పట్టుబడిన “మానవతావాది:”
రైటర్ల వద్ద నుంచి వసూలు చేసిన1.78.000/-….
సోషల్ మీడియా స్టార్ కాస్త ఏసిబి ట్రాప్ అంటూ స్క్రోలింగ్….

మానవతావాది నీ అంటూ సమాజ శ్రేయస్సు నా జీవిత ఆశయం అంటూనే మారో పక్క లంచం తీసుకోకుండా ఏ రిజిస్ట్రేషన్ చేయనంటు ఓ సోషల్ మీడియా స్టార్ ములుగు జిల్లా నా అడ్డ అంటూ కొన్ని సంవత్సరాలుగా అక్కడ పాగ వేసి మూడు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ” సబ్ రిజిస్టర్” బాధ్యతలు తీసుకొని వచ్చి రాగానే తన ,లంచం మార్కు చూపించిన సబ్ రిజిస్టర్ తస్లీమా మొహమ్మద్ 19200/- రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయింది. సంఘటన వివరాల్లోకి వెళితే. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ ఒకఎకరం 28 గుంటల భూమి కొనుగోలు చేశారు అందులో 128 గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మార్చి మొదటి వారంలో వచ్చారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకట్ ను కలిసి నగదును ఇవ్వాలని మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా చెప్పారు. ఈ క్రమంలో హరీష్ లంచం ఇవ్వడం ఇష్టం లేక వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం హరీష్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వెంకట్ కు 19 వేల 500 డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు వరంగల్ ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అంతేకాకుండా రూ.1,72,000 కు సరైన లెక్కలు లేనందున వాటిని కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. . కాగా, తస్లీమా ములుగు సబ్ రిజిస్ట్రార్ గా గతంలో పనిచేశారనీ ఆమె పై గతంలో ఆరోపణలు వున్న కాంగ్రెస్స్ ప్రజా ప్రతినిధి తో సాంఘిక కార్యక్రమంలో పాల్గొనడం తో ఆమె పై దాడులు చేయడానికి సహసించలేదని. ఇప్పుడు అదే చొరవతో మరింత అవినీతికి పాల్పడుతుందని అనేక మంది మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ను ఒక సందర్భంలో వివాదంలోకి లాగాలని ప్రయత్నించిందని పేరు తెలుపని కాంగ్రెస్స్ లీడర్ తెలిపారు. ఎది ఏమైనా అవినీతి తిమింగలం ఆటకట్టిన ఏసీబీ అధికారులకు మానుకోట జిల్లా లో మరి కొంతమంది పేర్లు కూడా వినిపించినట్లు తెలుస్తుంది త్వరలో వారి అవినీతి బాట బయలు చేసే అవకాశాలు ఉన్నాయని జిల్లా వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.
