భద్రాద్రి రాముని సాక్షిగా ఆగస్టు 15 న 2 లక్షల రుణ మాఫీ….
10 ఏండ్ల గ్యారంటీగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుంది…
మహబూబాద్ జన జాతర సభ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….
thovva web news. in… April 19 Friday….

భద్రాద్రి రాముని సాక్షిగా. ఆగస్టు 15 న రైతులకు రెండు లక్షల రుణమాఫీని పూర్తి చేసి అదే విధంగా కింట ధాన్యం కు500 బొనస్ గ్యారెంటీగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలో అమలు చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార జనజాతర సభలో ప్రజలకు హామీ ఇచ్చారు. శుక్రవారం ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ తెలంగాణలో 10 ఏండ్లు బిఆర్ ఎస్ పాలనలో ఈ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని విభజన హక్కుల్లో భాగంగా బయ్యారం కర్మాగారాన్ని కాజీపేట కొచ్ పాక్టరీ ఎందుకు తీసుకూరలేకపోయారని ప్రశ్నించారు నరేంద్ర మోడీ సంకా నాకి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం చేశారని ఎవరిని వదిలి పెట్టమని ఘాటుగా స్పందించారు.కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ఏమి చేస్తున్నారని కేసీఆర్ మోడీ ఇద్దరు దొంగలే అని వీరితో రాష్ట్రం దేశం కుంభకోణాల మయం అయిందని విమర్శించారు. బిడ్డ కవిత బెయిల్ కోసం కేసీఆర్ మోడీ నీ ప్రసన్నం చేసుకోవడానికి 5పార్లమెంట్ స్థానాల్లో బిజెపి గెలుపు కోసం చీకటి ఒప్పందం కుదిరింది అన్నారు. తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కులదోయడానికి కేసీఆర్ రోజుకో నక్క విన్యాసాలు చేస్తూన్నాడని” దిగిప దిగిపో అంటే నీ అయ్య జాగీరు కాదు కేసీఆర్ “తెలంగాణ ….అని ఎక్కువగా మాట్లాడితే బొందల్లో తొక్కడానికి తెలంగాణ ప్రజలు రడీగా ఉన్నారన్నారు. 10 ఏండ్ల గ్యారంటీగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుందని. ఎవరు భయపడో దన్నారు దేశంలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం రాబోతుందని రాహుల్ ప్రధాని చేయడానికి తెలంగాణ 14 ఎంపి సీట్లు గెలుస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి సోనియా గాంధీ కాంగ్రెస్ ఆంధ్ర లో ఓడిపోతుందని తెలిసిన తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం నిలబెట్టడం కోసం రాష్ట్రాన్ని ఇచిందని మోడీ తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేకనే రాష్ట్ర విభజన విషం చిమ్మడని .(తల్లి నీ చంపి బిడ్డను బతికించారని) అంటువంటి బిజెపి కి ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదాని. భాజపా బిఆర్ ఎస్ నీ బొంద పెట్టాలన్నారు.,ఉత్తర భారత దేశంలో కుంభమేళా కు వేల కోట్లు ఖర్చు పెట్టిన బిజెపి మేడారం జాతరకు. ముష్టి 3 కోట్లు ఇచ్చారని ఇదేనా ఈ ప్రాంతం పై మీ ప్రేమ అని నిలదీశారు. ఎలా ఈ ప్రాంతం ఓట్లు అడుగుతారని అన్నారు.దేశంలో గుజరాత్ ,ఉత్తర ప్రదేశ్ కు కేంద్రంలో అధిక నిధులు ఇస్తారు దక్షిణాదికి ఎందుకు ఇవ్వరని మంత్రి పదవులు ఇవ్వడం లో ఈ వివక్ష కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రజల ఆంక్షల నెరవేర్చడానికి పక్క ప్రణాళికలు తో రాబోతున్నమని2 లక్షల ఉద్యోగాలు గ్యారెంటీ గా ఇచ్చి తెలంగాణ యువత కు వెన్నుదన్నుగా ఉంటామని కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3లక్షల పై చిలుకు మెజార్టీ తో గెలవడం ఖాయమని గతంలో కేంద్ర మంత్రి ఈ ప్రాంత అభివృద్ధి ఆయనే చేసారని ఇక్కడ ఎంపి గా గెలిచిన సీతారాం నాయక్ కవిత ఏమి చేయలేదని అన్నారు, 14 మంది ఎంపి లతో వెళ్లి రాహుల్ ప్రధాని చేయడానికి తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన సహకరం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు , సీతక్క ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ,ఎమ్మెల్యే లు మురళి నాయక్ (మహబూబాబాద్ )రాంచంద్రు నాయక్. (డోర్నకల్ )కొరం కనకయ్య (ఇల్లందు),మాధవరెడ్డి,(నర్సంపేట) పాయం వెంకటేశ్వర్లు(పినపాక) 7నియోజకవర్గాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు.


