బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడం… పోడు భూముల సమస్యను పరిష్కరించడం ధ్యేయం…
ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎం.పీలు విఫలమయ్యారు
మహబూబాబాద్ పార్లమెంట్ బీఎస్పీ అభ్యర్థి కోనేటి.సుజాత
thovva web news.in may.06

గిరిజనులకు ఆదివాసీలకు అండగా ఉంటానని పోడు భూముల సమస్యను పూర్తి చేసే వరకు పోరాటం చేస్తానని విభజన హక్కులు ఇవ్వడంలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు విఫలంయ్యాయని. బీఎస్పీ అభ్యర్థి కోనేటి.సుజాత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పలు వీధుల్లో జాతీయ నాయకుల తో కలిసి బీఎస్పీ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఏనుగు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.. అనంతరం బీఎస్పీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభ్యర్థి తో కలిసి జాతీయకో ఆర్డినేటర్ బాలయ్య మాట్లాడుతూ…. బహుజన రాజ్యాధికారమే బీఎస్పీ లక్ష్యమని , అవకాశాలు రాని అట్టడుగు సామాజిక వర్గాలకు చెందిన వారికి చట్ట సభల్లో అవకాశం కల్పించడమే బిఎస్పి ప్రధాన ధ్యేయమన్నారు. నోట్ల రాజ్యాన్ని ఓడించాలి… ఓట్ల రాజ్యాన్ని సాధించాలని , రెడ్ల , వెలమ దొరల పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. బహుజన బిడ్డల బతుకులు మారాలంటే బీఎస్పీ అభ్యర్థి సుజాత ను గెలిపించాలని కోరారు.ఈ మీడియా సమావేశంలో బీఎస్పీ నాయకులు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు
