ఎవరికి ఓటేసిన భాజపా లోకి వెళ్తారు…
రాజ్యాంగం మార్చే కుట్రలను అడ్డుకోవాలి…
బీఎస్పీ అభ్యర్థి కోనేటి సుజాత…
Thovva web news.in.

బహుజనులను ఆదివాసి గిరిజనులను బానిసలుగా చేసే కుట్ర జరుగుతుందని భాజపా కాంగ్రెస్ బిఆర్ఎస్ కి ఓటిస్తే భాజపా పార్టీలోకి వెళ్తారని భాజపా కేంద్రంలో అధికారంలోకి వస్తే బడుగులకు అందజే రాజ్యాంగంలో ఫలాలను అందకుండా చేసి రాజ్యాంగాన్ని తీసేస్తారని మహబూబాబాద్ పార్లమెంటు బీఎస్పీ అభ్యర్థి కోనేటి సుజాత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ తో కలిసి బీఎస్పీ పార్లమెంట్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వందలాది మంది కార్యకర్తలు నాయకులు,తో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు.అనంతరం కార్లర్యాలీ తో వచ్చి కోర్టు ముందున్న డా అంబేడ్కర్ విగ్రహంకి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం కార్నర్ మీటింగ్ లో రాష్ట్ర అధ్యక్షులు, స్టార్ కంపైనర్ మంద ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినా వారు బీజేపీ లోకి వెళ్తున్నారని అయితే బిజెపి అంతిమ నిర్ణయం రాజ్యాంగo ను రద్దు చేయడమేనని దీని వలన బహుజన సమాజం మళ్ళీ బానిస సమాజంగా మారే ప్రమాదం వుందని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందుకే బీఎస్పీ అభ్యర్థి కోనేటి సుజాత ఏనుగు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బోయిని చంద్ర శేఖర్ ముదిరాజ్,పార్లమెంట్ ఇంచార్జీ దార్ల శివరాజ్, జిల్లా ఇన్చార్జి లు ఎల్ విజయకాంత్ ధార ప్రసాద్ రావు, జిల్లా అధ్యక్షులు ఈసంపెళ్లి ఉపేందర్, జిల్లా మహిళా కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్,ఉపాధ్యక్షులు తగరం నాగన్న ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీను ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐతo ఉపేందర్, జిల్లా కార్యదర్శి గూగులోత్ నరేష్ నాయక్,EC మెంబర్ తప్పీట్ల చాణక్య, తొకల నాగరాజు, బాషిపంగు మహేందర్, రేవంత్ నాయక్, పసులది ముఖేష్, కాడపాక రాజ శేఖర్ వర్మ, కలవల నరేష్, కేసుపాక కృష్ణ, ఆరేపెళ్లి రాంబాబు, వంగూరి స్వరూప , బాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు