ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
–ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపిఎస్
THOVVA WEB NEWS.IN, 11, MAY,SAT.


రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపిఎస్ తెలియజేసారు.ఇందులో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం మరిపెడ పట్టణం లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పారా మిలిటరీ బలగాలతో కలిసి పట్టణంలోని లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాలు నుండి రాజీవ్ గాంధీ సెంటర్,పోలీస్ స్టేషన్ ,కార్గిల్ మీదుగా లక్ష్మ రెడ్డి ఫంక్షన్ హల్ వరకు ఈ ఫ్లాగ్ మార్చ్ సాగింది. అనంతరం మరిపెడ లక్ష్మారెడ్డి ఫంక్షన్ హల్ లోపోలీస్ సిబ్బంది బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది.అనంతరం మరిపెడ బంగ్లా రాజీవ్ సెంటర్ నుండి మెయిన్ రోడ్డు మీదిగా లక్ష్మారెడ్డి ఫంక్షన్ హల్ వరకు జిల్లా మరియు కేంద్ర బలగలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారని తెలియజేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలకు భరోసా కల్పించడంలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అక్రమ మద్యం,నగదు రవాణాకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ,ట్రైనీ ఐపీఎస్ పండరి చేతన్,అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, తొర్రుర్ డిఎస్పీ సురేష్, సీసీఎస్ డిఎస్పీ మోహన్,ఎస్.బి సీఐ బాలాజీ వరప్రసాద్, సీఐ హత్తిరాం నాయక్, ఎస్ఐలు తహేర్ బాబా,తొర్రుర్ సబ్ డివిజన్ సిఐ లు ఎస్సై లు,అధికారులు, జిల్లా మరియు కేంద్ర బలగలు పాల్గొన్నారు