ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి…

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఉపాది హామీ పనులను, పని ప్రదేశం  పరిశీలించిన ప్రత్యేక పరిశీలకులు

Thovva web news. May 16 Thu;

దోమల నివారణ చర్యలు చేపట్టి డెంగీ నిర్మూలనకు  ప్రతిజ్ఞ చేద్దాం

నేడు జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవం ను పురస్కరించుకొని మహబూబాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని  ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు కలిసికట్టుగా కృషిచేస్తేనే  నియంత్రించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఎందుకంటే, ఇది మానవ ప్రేరేపిత వ్యాధి. దోమల వృద్ధికి అనుకూల మైన పరిస్థితులను మనుషులే సృష్టిస్తు న్నారని అందువల్ల డెంగీ పీడ వదిలిపోవాలంటే దోమల నియంత్రణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని,  దోమలు వృద్ధి చెందకూడదంటే ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు వంటివి ఇంటి చుట్టుపక్కల ఉండకూడదని, ఇంట్లో దోమలు కుట్టకుండా పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు ధరించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ఇలాంటి జాగ్రత్తలపై క్షేత్ర స్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది వాడవాడలా విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా 52 లక్షల డెంగీ కేసులు నమోదయ్యాయని. ఏటా నలభై వేల మందిదాకా దీని మూలంగా మృత్యువాత పడుతున్నారని, ఆగ్నేయాసియా దేశాల్లో డెంగీ విజృంభణ తీవ్రంగా ఉందని, భారత్ లో దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కేంద్రం లెక్కల ప్రకారం, గత ఆరు సంవత్సరాల్లో పదకొండు వందల మంది డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, ఎనిమిది లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని ఇందులో ఎనిమిది శాతం కేసులు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నాయని పేరుకొన్నారు. డెంగీ నివారణ, నియంత్రణలో ప్రజలకు భాగ స్వామ్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని, ఈ క్రమంలో నే ఏటా మే 16ను జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవంగా జరుపుకోవాలని ఈ సంవత్సరo స్లొగన్ “సమాజం తో భాగస్వామ్యమై – డెంగ్యూ ను నివారించుదాం.” అని  నిర్ణయించిందని ఆయన తెలిపారు.డిప్యూటీ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ అంబరీష మాట్లాడుతూ డెంగీ వ్యాధికి ఇప్పటివరకు కచ్చితమైన ఔషధం, టీకా అందుబాటులో లేవని  డెంగీ సోకిన వారిని కుట్టిన దోమలు, ఇతరులను కాటు వేసినప్పుడు ఈ వ్యాధి వారికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని, అందువల్ల డెంగీ బారిన పడినవారు తప్పనిసరిగా దోమతెరల్లోనే నిద్రించాలని. డెంగీ వ్యాధి సోకిన 60శాతంవ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవని ఇలాంటి వారి ద్వారా వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని అందువల్ల డెంగీ విజృంభించిన ప్రాంతాల్లో విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో లో  ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేశ్వర్ రావు, తీగల వేణి వైద్యాధికారి డాక్టర్ రాంబాబు, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్, బస్తీ దవాఖాన అధికారి డాక్టర్ శివ, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఇన్ చార్జ్ డి‌పి‌హెచ్‌ఎన్‌ఓ మంగమ్మ, ఆరోగ్య విద్యా బోధకులు పురుషోత్తo , సబ్ యూనిట్ ఆఫీసర్ గోపిచంద్, ఎం‌పి‌హెచ్‌ఈ‌ఓ వొబిలిశెట్టి రామకృష్ణ, హెల్త్ విజిటర్ రత్నకుమారి, పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశ కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *