వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు, కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆచార్య బానోతు సురేష్ లాల్
Thovva web news.may 18.sat.

విద్యార్థులలో శాంతి కుసుమాలను వికసింప చేయాలని, ప్రేమ, సహాయం, అభిమానం, మానవత్వం ఇలాంటి లక్షణాలను బాల్యం నుండి పెంపొందిస్తూ ఈర్ష్యా,ద్వేషాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలని వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు, కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆచార్య బానోతు సురేష్ లాల్ అన్నారు. శనివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన చిత్రకళా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. సొసైటీ వ్యవస్థాపకులు మహమ్మద్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ త్వరలో జరగబోవు శాంతి పండుగ కార్యక్రమంలో ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల మాట్లాడుతూ చిన్నారులను చిన్ననాటి నుండి ప్రతి పోటీలో పాల్గొనేటట్లు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. సంస్థ పిఆర్ఓ నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో ఓపికతో చిన్నారులను పోటీలో పాల్గొనటానికి తీసుకువచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ, అకాడమీ ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు కవి గాయకుడు రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. చిన్నారులతో పాటు వారి తల్లులు కూడా కొందరు సీనియర్ విభాగంలో ఈ పోటీలో పాల్గొనడం కోసమెరుపు….

