
జీవవైవిధ్య కమిటీ సభ్యుడు.హరిత మిత్ర అవార్డు గ్రహీత. దైద వెంకన్న…….
జీవ వైవిధ్యం పై ప్రతిజ్ఞ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న
Thovva web,21 may.Tue
ప్రపంచ జీవవైవిద్య ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని అందుకు ప్రతిజ్ఞ చేయాలని మహబూబాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మర్నేని వెంకన్న హరిత మిత్ర ధైద వెంకన్న పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జీవవైవిద్య దినోత్సవాన్ని ప్రపంచమంతా బుధవారం జరుపుకుంటున్నందున ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ కుటుంబంతో తోహరిత మిత్ర అవార్డు గ్రహీత. దైద వెంకన్న……. ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి.మూగా జీవలను కాపాడుకోవాలని పిలుపు నిస్తూ. నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని రక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్ణేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో దొంగల బీభత్సం… సామాన్యులకు రక్షణ ఎది?
తులం బంగారం, 46000 వేల రూపాయలు నగదు అపహరణ…
Thovva web,21 may.Tue
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం… సృష్టించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జర్నలిస్ట్ కాలనీలో ఓ ఇంట్లో కిరాయికుంటున్న సుందర్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో దాచుకున్న తులం బంగారం, 46000 వేల రూపాయలు నగదు అపహరణ… గురైందని ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సుందర్ కాలనీలోనీ మేన్ రోడ్డులో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం భార్య పిల్లలతో ఓ శుభకార్యానికి హైదారాబాద్ వెళ్ళాడని ఉదయం మూడు గంటల ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు గేటు గోడ దూకి ఇంటిలోకి ప్రవేశించి వుండవచ్చని ఇంటి యజమాని తెలిపారు సుందర్ కుటుంబాన్ని సంప్రదించగా బంగారం, 46 వేల రూపాయలు నగదు అపహరించి ఉండవచ్చు అని ఉదయం ఇంటి యజమాని బయటికి వచ్చి చూసే సరికి ఇంటి తలుపులు తీసి ఉన్నాయి. విషయం పోలీసులకు తెల్పడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం తో నమూనాలు సేకరిoచారు. కానిస్టేబుల్ ఇంట్లోనే చోరీ జరగడంతో సామాన్యులకు రక్షణ ఎదని ప్రజలు వాపోతున్నారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగి పార్వతి నిరసనపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి
thovva web,21 may.tue
ఔట్సోర్సింగ్ ఉద్యోగి పార్వతి నిరసనపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారివార్తకు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు స్పందించి మంగళవారం జిల్లా పౌర సంబంధాల శాఖ ద్వారా వివరణ ఇచ్చారు ఈ వివరణ సారాంశం మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లో 2017 నుండి ఔట్సోర్సింగ్ అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి జి. పార్వతి కార్యాలయంనకు సరిగా హాజరు కాదని, సమయమునకు రాదని, తరుచుగా సెలవులు పెడుతుందని, హాజరు పట్టికలో దిద్దుతుందని, మిగతా కార్యాలయ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం, గొడవలు పెట్టుకోవడం చేస్తుందని, జిల్లా విద్యాశాఖాధికారి పి. రామారావు తెలిపారు. ఇంతకుముందు రెండు సార్లు వేరే పాఠశాలలకుడిప్యూటేషన్ పై పంపినను, అక్కడ కూడా వివాదాలు సృష్టించడం తో అక్కడి ప్రధానోపాధ్యాయులు వెనక్కి పంపడం జరిగిందని తెలిపారు. పై విషయాలలో ఆమెకు రెండు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందని, ఐనను మార్పు లేకపోవడం తో 2024-25కు ఆమెను రెన్యువల్ చేయడం లేదని ఔట్సోర్సింగ్ ఎజేన్సికి వేరే అటెండర్ ను పంపమని రాస్తున్నామని తెలిపారు.

కే ఎస్ ఎన్ రెడ్డి కి మాతృవీయోగం….
పరామర్శించిన మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్
thovva web,21 may.tue
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కే.ఎస్.ఎన్.రెడ్డి మాతృమూర్తి కొండూరు రంగనాయకమ్మ మంగళవారం హైదరాబాదులోని కె ఎస్ ఎన్ గృహంలో మృతి చెందారు బుధవారం పార్థివ దేహాన్ని స్వగ్రామమైన రెడ్యాల సికింద్రాబాద్ తండాలో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి వార్త తెలియగానే పలువురు భరస నాయకులు నేతలు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు..
కె ఎస్ ఎన్ కుటుంబాన్ని పరామర్శించిన డోర్నకల్ మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే లు..
కె ఎస్ ఎన్ రెడ్డి మాతృమూర్తి రంగనాయకమ్మ మరణ వార్త తెలియగానే డోర్నకల్ మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు రెడ్యానాయక్, శంకర్ నాయకులు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిచి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

గిరిజన భూములను కభ్జాలకు పాల్పడుతున్న గిరిజన జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగి భార్య …
కబ్జాలపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలి.
ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్
thovva web,21 may.tue
గిరిజన భూములను కబ్జాలకు పాల్పడుతూ అమాయకులకు సర్వే నెంబర్లు మార్చి అమ్మి సొము చేసుకుంటున్న గిరిజన జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగి భార్య పై చర్యలు తీసుకోవాలనిఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ అన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో గిరిజన నాయకులతో కలిసి మాట్లాడుతూ శనిగపురం వీరారం తండాకు చెందిన అమాయక గిరిజనుల వారసత్వ భూములను మరో గిరిజన జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగి తన భార్య పేరుతో భూ కబ్జా కు పాల్పడుతున్నాడని. మహబూబాబాద్ మండలం శనిగపురం రెవెన్యూ శివారులో గల సర్వే నెంబర్ 274 లో బీసీ కాలనీలో వీరారం తండా గిరిజన ప్రజలకు చెందిన వారి తాతలకు 16 ఎకరాల భూమి 1974 వ సంవత్సరం నుండి 38/ఇ, టెనేన్స్ యాక్ట్ ద్వారా సంక్రమించిన వారసత్వ భూములను ఓ గిరిజన జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగి తన భార్య పేరుతో తన అంగ బలంతో, అధికారుల అండదండలతోటి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, అధికారులను ప్రలోభ పెట్టి, తన అధికార బలాన్ని ఉపయోగించి భూమిని అక్రమించడని బాధితులు వాపోయారు. బాధితుల కు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు.

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
గునిగంటి కమలాకర్ మారబోయిన వెంకటేశ్వర్లు
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గునిగంటి కమలాకర్ చిన్నగూడూరు మండల అధ్యక్షులు మారబోయిన వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం చిన్నగూడూరు మండల కేంద్రంలోని దాశరధి ప్రాంగణం వద్ద రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ గాంధీకి జోహార్లు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గునిగంటి కమలాకర్ మారబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…. దేశ ప్రజలకు గాంధీ కుటుంబ సభ్యులు చేసిన సేవలు కొనియాడదగినవని పేర్కొన్నారు. స్వర్గీయ దివంగత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గా సేవలందించిన సమయంలో ఇంటర్నెట్ కంప్యూటర్ రంగం అభివృద్ధి దిశలో పయనించిందని గుర్తు చేశారు. దేశ ప్రజల హృదయాల్లో రాజీవ్ స్థానం సుస్థిరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సుధ గాని నాగేష్ యాకన్న మేఘ్య దాసరి రాజు పలువురు కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

టిఎంజెయు వార్షికోత్సవ వేడుకను విజయవంతం చేయండి
– తెలంగాణ మాల జర్నలిస్ట్ ల యూనియన్ జిల్లా అధ్యక్షులు చందా శ్రీనివాస్
Thovva web,21 may.Tue
మాల జర్నలిస్టుల యూనియన్ మహాసభను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు చందా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహదేవతో కలిసి పాల్గొని మాట్లాడుతూ జూన్ 6వ తేదీన నరసింహుల పేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో జిల్లా మాల జర్నలిస్టుల సంఘం ప్రథమ వార్షికోత్సవం జరుగుతుందని అన్నారు. తెలంగాణ మాల జర్నలిస్టుల వార్షికోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన మాల యూనియన్ పాత్రికేయ సభ్యులను కోరారు. మాల జర్నలిస్టుల సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి యూనియన్ నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు, పాల్గొనే ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల, నాయకులు సకాలంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డు అశోక్. కొప్పుల శ్రీనివాస్. గండమాల రోశయ్య. తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లాఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డేవిడ్, మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు తదితరులు..