Nellikuduru.Thovva news.23.May.Thu

మండలంలోని ఎర్రబెల్లి గూడెం యాదవ కులస్తు లు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం లోని ముత్యాలమ్మ తల్లి కి గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా బోనాలు చేశారు. ప్రతి సంవత్సరం నిర్వహించే బోనాల జాతరలో భాగంగా భక్తులు ఎడ్ల బండ్లు,ఆటోలు, ట్రాక్టర్లు, కార్ల లో బుధవారం రాత్రి ఆలయానికి తరలివచ్చి ఆ రాత్రంతా అమ్మవారికి భక్తితో పట్నాలు వేసి కొలిశారు.అనంతరం ఉదయం మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకొని డి జే లు,డబ్బు చప్పులతో శివసత్తుల పూనకాల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేసి లోకపావనికి బోనం నైవేద్యం చెల్లించారు.ఈసందర్భంగా ఆ గ్రామస్తులు సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతోప్రతి కుటుంబం విలసిల్లాలని ముత్యాలమ్మ తల్లి ని వేడుకున్నారు.
తీన్మార్ మల్లన్న గెలుపు కోసం విస్తృత ప్రచారం

Bayyaran. Thovva.news.23.May.Thu
బయ్యారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న గెలుపు కోసం గురువారం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ ను చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంబాల ముసలయ్యతోపాటు ఆ పార్టీ మండల జిల్లా నాయకులు వీరారెడ్డి ప్రభాకర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఈ ప్రచారంలో ఉన్నారు.స్థానిక ఎమ్మెల్యే రెండుసార్లు వచ్చి పట్ట బద్రులతో సమావేశం ఏర్పాటు చేసి మల్ల నువ్వు గెలిపించాలని కోరిన విషయం వీధితమే మండలంలో మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు పట్టబద్రు లను అందరూ స్వయంగా కలిసి ఓటు వేయాలని కోరుతున్నాను
సోనియా గాంధీ ,మల్లికార్జున ఖర్గే దీవించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న
మరిపెడ లోఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Maripeda.Thovva.news.23.May.Thu
అఖిలభారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీవించి పంపించిన వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిచింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం మరిపెడమండల కేంద్రంలోని రెడ్డి వేడుకల మందిరంలో డోర్నకల్ నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహాక సమావేశం డోర్నకల్ శాసనసభ్యుడు జాటోత్ రామచంద్రు నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గ పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు. వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. . అనంతరం ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రామసహాయం రఘురాంరెడ్డి పోరిక బలరాం నాయక్ పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశానికి మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు నాయకులు కార్యకర్తలు పలువురు పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.
నరేంద్ర మోదీ పాలనలో అభివృద్ధి
ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి
బిజెపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గాదే రాజ వర్ధన్ రెడ్డి

Maripeda. Thovva news.23.May Thu
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని బిజెపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గాదే రాజ వర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మరిపెడ మండల కేంద్రంలో బిజెపి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ వర్ధన్ రెడ్డి మాట్లాడారు. త్వరలో జరగనున్న వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టబద్రుల నియోజకవర్గం నుండి బిజెపి పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టబద్రులకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రసంగాలు దేశాన్ని విచ్చిన్నం చేసేలా ఉన్నాయని విమర్శించారు. వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలలో ఓటర్లు ప్రలోభాలకు లోను కావద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో కే జగన్, సురేందర్ రెడ్డి భుక్య సంగీత బుల్లెట్ కృష్ణనాయక్ లింగానాయక్ బింగి రమేష్ యాదవ్ పలువురు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ మానవాళి ఆదర్శం గౌతమ బుద్ధుడు..
గిరిజన సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కిషన్ నాయక్..

MHBD. Thovva news.23.May Thu
ప్రపంచ మానవాళికి మార్గదర్శిగా భగవాన్ గౌతమ బుద్ధుడు నిలిచాడని గిరిజన సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కిషన్ నాయక్ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద భగవాన్ గౌతముని 2568జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు గౌతముడు శాంతి అహింస ప్రబోధించారాని. ఆయన మార్గంలో ఎంతో మంది రాజులు యుద్దాలను వదిలి శాంతికాముకులుగా బౌద్ధ బిక్షులు జీవించారని అన్నారు సమాజంలో జరుగుతున్న కుల వివక్షతను ఖండించాడ ని కులరహిత సమాజం కోసం పునాదులు వేశాడని అన్నారు. హింసను వ్యతిరేకించి కరుణామయుడుగా ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛ సమానత్వం స్రీల గురించి బుద్ధుడు బోధించడనీ అన్నారు. ఆయన మార్గంలో నేటి సమాజం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిల పీ రయ్య, కెవిపిఎస్ దుడేల రామ్మూర్తి న్యాయవాదులు వాసం ఆనంద్ కొప్పుల రమేష్ భూక్య మోహన్ బుర్ర శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్. .ఏం ఎఫ్ ఎస్ నాయకులు యాకయ్య, ప్రవీణ్ శీను రామకృష్ణ అంబాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

అంతర్ జిల్లా దొంగను చాకచక్యంగా పట్టుకున్న మహబూబాబాద్ టౌన్ పోలీసులు..
5 కేసులలో 46 గ్రాముల బంగారం, 05 తులాల వెండి వస్తువులు, 2 సెల్ ఫోన్ లు ఒక యూనికాన్ బైకు స్వాధీనం.
Mhbd.Thovva web news.23.may thu
అంతర్ జిల్లా దొంగలను చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుంచి 5 కేసులలో 46 గ్రాముల బంగారం ఐతులాల వెండిని రెండు సెల్ ఫోన్లు ఒక యూనికాన్ బైక్ని స్వాధీనం చేసుకున్నట్టుటౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు గురువారం పట్టణంలో నేరాలకు పాల్పడిన వారి వివరాలు తెలియజేస్తూ ఎస్ఐ జి ఉపేందర్ వారి సిబ్బందితో మహబూబాబాద్ పట్టణంలోని ఇల్లందు రోడ్ లోని ఫూలేజంక్షన్ వద్ద వెహికల్ చెకింగ్ చేయుచుండగా ఒక యూనికాన్ బైక్ పై ఒక వ్యక్తి అనుమానస్పదంగా రావడాన్ని గమనించారు. వెంటనే అతనిని పట్టుకొని బండికి సంబంధించిన పత్రాలు అడుగగా, అతని వద్ద ఎలాంటి బండి పత్రాలు లేకపోవడంతోపాటు, అతను గతంలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసులో అరెస్ట్ అయిన చింత యుగేoదర్ గా గుర్తించి అతనిని తనిఖీ చేయగా అతని వద్ద బంగారం, వెండి వస్తువులు కొన్ని సెల్ ఫోన్ లు ఉండడంతో విచారించామన్నరు. ఖమ్మం, మహబూబాబాద్ లలో పలుదొంగతనాలు చేసినట్లు నేరస్తుడు తెలియజేశారని. యుగెందర్ కు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో యుగెందర్ మరియు అశోక్ ఇద్దరు జల్సాలకు అలవాటుపడి ఇద్దరు కలసి మహబూబాబాద్, గార్ల, ఖమ్మం, డోర్నకల్, సీరోలు మొదలగు ప్రాంతాలలో పలు దొంగతనాలు చేసి జైలుకు కూడా వెల్లారు. ఈ కేసులలో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మహబూబాబాద్ సిసిఎస్ సిఐ చంద్రమౌళి, మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్, , ఎస్ఐ ఉపేందర్ లను మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు అభినందించారు.
బైండోవర్ ఉల్లంఘన జరిమానా

Guduru.Thovva news. 23.May Thu;
మండలం ఎక్సైజ్ పరిధిలోని కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి కి చెందిన భూక్య తిరుపతి, అజ్మీర శ్రీనులను బైండోవర్ ఉల్లంఘన కేసులో గురువారం రూ. 50 వేల జరిమాన వేసినట్లు ఎక్సైజ్ సీఐ బిక్షపతి తెలిపారు. తిరుపతి, శ్రీనులపై గతంలో వివిధ కేసులపై బైండోవర్ కేసులు ఉన్నాయని, మళ్లీ పలు కేసులు కావడంతో బైండోవర్ ఉల్లంఘన కేసులో తహసిల్దార్ రమాదేవి ఎదుట ప్రవేశపెట్టగా ఒక్కొక్కరిపై రూ. 50 జరిమాన వేసినట్లు సిఐ తెలిపారు..

మార్నింగ్ వాకర్స్ తో తీన్మార్ మల్లన్న..
MHBD. Thovva news.23.May.Thu;
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజీ వాకర్స్ జూనియర్ కాలేజీలో ఉషోదయ వాకర్స్ తో పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు, అనుచబడ్డ తెలంగాణ ఆత్మగౌరవ గొంతుగా చట్టసభలలోకి పంపించేందుకు పట్ట బద్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు వాకర్స్ తో మాట్లాడుతూ గత పదేళ్లుగా తెలంగాణలో జరిగిన రాక్షస పాలన అంతం ఒందేందుకు ప్రతి ఒక్కరు ప్రతిన భూని బిఆర్ ఎస్ పార్టీ నీ కూకటి వేళ్ళతో పెకిలించి ప్రజా ప్రభుత్వానికి పట్టకట్టి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అని నిరూపించుకున్నారని, తనకు అవకాశం ఇచ్చి చట్టసభల్లోకి పట్ట భద్రుల గొంతుక గా పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బండి పుల్లయ్య తెలంగాణ ఉద్యమ నాయకులు డోలి సత్యనారాయణ పిల్లి సుధాకర్ తీన్మార్ మల్లన్న మహబూబాబాద్ జిల్లా టీమ్ బాధ్యులు చిలువెరు సమ్మయ్య గౌడ్, వాకర్స్ పుర ప్రముఖులు పాల్గొన్నారు.
మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలి …
Guduru. Thovva news.23.May.Thu;
గూడూరులో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎక్సైజ్ సీఐ తిరుపతికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా భాజపా మండల శాఖ అధ్యక్షుడు గుండెబోయిన మల్లేష్ మాట్లాడుతూ ఏజెన్సీ గిరిజన ప్రాంతమైన గూడూరు లో 3 లైసెన్స్ మద్యం దుకాణాలు సిండికేట్ గా మారి అధిక ధరలు మధ్య అమ్మకాలు చేస్తూ పేదలకు ఇబ్బందులు గురి చేస్తున్నారని వెంటనే అధికారులు స్పందించి అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న మద్యం దుకాణం దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాకేష్ రెడ్డి విజయం ఖాయం
బోనస్ బోగస్ మంత్రి తన్నీరు హరీష్ రావు
Thovva news.23.May.Thu
వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయం ఖాయమని మంత్రి తన్నీరు హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం మరిపెడ మండల కేంద్రంలోని భార్గవ వేడుకల మందిరంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహాక సమావేశం డోర్నకల్ మాజీ శాసన సభ్యుడు డిఎస్ రెడ్యానాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. రబీలో పండించిన వరి ధాన్యాన్ని నేటికీ కొనుగోలు చేసే పరిస్థితి లేదని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేని పక్షంలో రైతులు గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు ప్రభుత్వం ఇస్తానన్న రూ 500 బోగస్ గా అభివర్ణించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తూ ప్రజలను వంచిస్తుందని ప్రభుత్వ తీరును విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలో బిజెపి రెండు పార్టీలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ద్వియబట్టారు. సమాజ మార్పు పట్టభద్రులతోనే సాధ్యమవుతుందని అది మీనించే ప్రారంభం కావాలని ఆశించారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్ పాడి కౌశిక్ రెడ్డి భారత రాష్ట్ర సమితి నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి బానోత్ శంకర్ నాయక్ బిందు గుడిపుడి నవీన్ రావు, కుడితి మహేందర్ రెడ్డి రాంబాబు అరుణ శారదా సింధు కాలు నాయక్ అయూబ్ నకల్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


తీన్మార్ మల్లన్న వైపు పట్టభద్రుల చూపు…
భారీ మెజార్టీ తో విజయం ఖాయం….
పాలకుర్తి నియోజకవర్గ పట్ట భద్రుల ఎన్నికల ప్రచారంలో
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని, నియోజకవర్గ ఇన్చార్జి ఘన్సీ రాజేందర్ రెడ్డి.
THORRURU.THOVVA NEWS.23,MAY THU,
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి అధ్యక్షతన వరంగల్ , ఖమ్మం , నల్లగొండ , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల సన్నాహక సమావేశం గురువారం తొర్రురు పట్టణంలోని రామ ఉపేంద్రమ్ గార్డెన్లో ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశరుణ్వరంగల్, ఖమ్మం, నల్లగొండ, ఏమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న , హాజరై మాట్లాడుతూ ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని పట్టభద్రుల ఎన్నికల్లో మల్లన్న ఒంటరిగా పోటీ చేసి ఒక లక్ష అరవై వేల పై చిలుక ఓట్లు సంపాదించి బిఆర్ఎస్ అభ్యర్థి ని గడగడ లాడించాడు, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ అండగా ఉంది అందరం కలిసి ఆకాండ మెజారిటీ అందిద్దాం అని పిలుపునిచ్చారు..ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, నిరుద్యోగ, సమస్యల పరిష్కరానికి నిరంతరం పట్టువదలని విక్రమార్కుడు తీన్మార్ మల్లన్న అని సాధారణ కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న పట్టబద్రుడు_ఉద్యోగ భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎంప్లాయి ఫ్రెండ్లీ విధానం దేశానికే గర్వకారణం_ అని పిలుపునిచ్చరు. ప్రతి పట్ట భద్రుడు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ బ్లాక్ అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రయివేట్ ఉద్యోగులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, పార్టీ ముఖ్యనాయకులు, పట్టభద్రులు, తదితరులు, పాల్గొన్నారు.._