వైభవంగా శ్రీ యోగానంద నృసింహస్వామి తిరు కళ్యాణం
కళ్యాణానికి పోటెత్తిన భక్త జనం
Thovva web news. May 23. Thu ;
నరసింహులపేట మండల కేంద్రంలోని అతి పురాతన దేవాలయంగా పేరుగాంచిన కపిలగిరి కొండపై వెలసిన శ్రీ యోగానంద లక్ష్మి నృరసింహ స్వామి కళ్యాణోత్సవం చెంచులక్ష్మి,ఆదిలక్ష్మి అమ్మవార్లతో గురువారం రాత్రి తొమ్మిది గంటలకు అతి వైభవంగా జరిగింది.స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు తొలుత ఆలయంలో ఉత్సవ విగ్రహాలను ప్రధాన అర్చకులు కుమారాచార్యులు, సముద్రాల నరసింహచార్యుల ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ట,మూల మంత్ర హవచనం పూజలు ప్రారంభిన అనంతరం ఆలయ నిర్వాహకులు నాయిని గౌతమ్ రెడ్డి,శ్రీ యోగానంద లక్ష్మీ నృరసింహ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఎదుర్కోలు నిర్వహించి రాత్రి 10:30 గంటలకు ఆలయ ప్రాంగణంలో పూలతో అలంకరించిన మండపంపై స్వామివారి ఆది లక్ష్మి,చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించి మేళతాళాలను నడుమ కల్యాణ మండపంపై తీసుకువచ్చి కళ్యాణ తంతు కార్యక్రమం నిర్వహించారు.అభిజిత్ లగ్నంలో ఆదిలక్ష్మి,చెంచులక్ష్మి నరసింహ స్వామికి పాణిగ్రహణం(జీలకర్ర బెల్లం)కార్యక్రమం నిర్వహించారు.కాగా అనంతరం మాంగల్య ధారణ గావించారు.వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో బండి రమేష్, అనుమాండ్ల వెంకట్ రెడ్డి,కొండబత్తిని జగదీశ్వర్, కర్ల నాగన్న,జినుకల రమేష్, కడుదుల రామకృష్ణ,కొండ్రెడ్డి క్రాంతి రెడ్డి,యోగానంద లక్ష్మీనరసింహ స్వామి సేవా సమితి సభ్యులు ఏరనాగి కిషోర్ కుమార్,మంచినీళ్ల యాకూబ్ రెడ్డి,పట్నూరి ప్రేమ్ కుమార్,దాస రోజు శేషు కుమార్,ఇమ్మడి శేషు కుమార్,వీరేశ్ తదితరులు ఉన్నారు.
కళ్యాణ చిత్ర మాలిక
