ప్రభుత్వ కార్యాలయంలో తాచుపాము హల్చల్….
బిక్కు బిక్కు మంటూ ఉద్యోగుల విధులు…
MHBD.Thovva news.24,MAY Fri
జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి డిఈ కార్యాలయంలో తాచు పాము హల్చల్ చేసింది . ఉద్యోగి తెలిపిన సమాచారం ప్రకారం జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి కార్యాలయంలో తాచుపాము లోపలికి వచ్చి ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసింది ఆవేశంగా బుసాలు కొడుతూ అటు ఇటు తిరగడం తో ఉద్యోగులు విధులు నిర్వర్తించడానికి ఇబ్బందులు గురయ్యారు. ఎటు పోవాలో తెలియలేని పాము కార్యాలయం ముఖ్యమైన ఫైల్స్ వున్న గదిలోకి దూరడం వెనువెంటనే ఆ గదికి తాళం వేసి వేరే గదిలో నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అర్ అండ్ బి కార్యాలయం కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళక పోవడం చుట్టూ చెట్లు పొదలు వుండటం తో ఏ క్షణాన ఏ విష సర్పాలు వస్తాయో అని బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తూ ఉన్నారు.ప్రజాతంత్ర కు తెలియడం తో పాములు పట్టే వారికి సమాచారం అందించి పామును పట్టే యత్నం చేశారు

.
మండే ఎండల్లో విద్యార్థులు పెయింటర్ గా అవతారం….
MHBD.Thovva news.24,MAY Fri
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి పట్ట పగలు ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నరు.45 డిగ్రీల ఎండలో కనీసం కాలు కూడా బయట పెట్టలేని స్థితిలో ఏకంగా ఆరుబయట ఎండలో విద్యార్థులు తమ కాలేజి బోర్డును తామే పెయింట్ వేసుకొని వచ్చే విద్యా సంవత్సరానికి ముస్తాబు చేసుకుంటున్న దృశ్యం రోడ్డు పై వెళుతున్న వాహనదారులు బాటసారులను కలచివేసింది. వివరాల్లోకి వెళితే జిల్లా కేంద్రంలోని అర్ సి ఓ కార్యాలయానికి కూత వేటు దూరంలో వున్న.(టీజిటి డబ్లాయ్యూ అర్జెసి) కాలేజి లో శుక్రవారం ఎర్రటి ఎండలో కాలేజి అటెండర్ విద్యార్థులతో కలిసి కాలేజీ బోర్డు రాయించారు.ఎర్రటి ఎండలో నిలబడలేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గతంలో ఇదే కాలేజి లో పలు సార్లు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం తో రోడ్డు పై బైఠాయించారు.. అయిన తీరు మారడం లేదు దీనిపై స్పందన కోసం అర్ సి ఓ వద్దకు వెళ్ళగా అందుబాటులో లేకపొడం కార్యాలయ సిబ్బంది మేడం లీవ్ లో వున్నారంటూ సమాధానం తెలిపారు.

వైభవంగా శ్రీ లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం
GUDURU.Thovva news.24,MAY Fri;
శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు గురువారం రాత్రి మే 24: గూడూరులోఅంగరంగ వైభవంగా పెంచారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ కమిటీ చైర్మన్ ఏపూరు శ్యాంసుందర్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తరఫున తీసుకురాగా ఎదుర్కొర్ల కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయం ఆవరణలో దేదీప్యమానంగా అలంకరించిన కళ్యాణ వేదికపై ఆలయ స్థానాచార్యులు వేదాంత వరదరాజాచార్యులు, వేణుగోపాలచార్యులు, హనుమకొండ నుంచి వచ్చిన వేద పండితులు అనంత శేష రాజన్చార్యులు, గోపాలకృష్ణ చార్యులు, రామకృష్ణ మాచార్యులు, వంశి కృష్ణమాచార్యులు పేద మంత్రోత్సవాలతో మెడికల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏపూరు శ్యాంసుందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, కమిటీ అధ్యక్షుడు నూనావత్ రమేష్, ఆలయ కమిటీ సభ్యులు మెరుగు నరేష్, పుల్లూరు భాస్కర్, చిక్కుల నరేష్, బొల్లికొండ రాజు, కందికొండ శ్రీనివాస్, పింగిలి శ్రీనివాస్, కాల్ సాని వేణు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నరు

. ఘనంగా హనుమాన్ శోభాయాత్ర ….
GUDURU Thovva news.24,MAY Fri,
గూడూరులోశ్రీ లక్ష్మి నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమాన్ భక్తమండలి, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయ కమిటీ,గురుస్వామి మెరుగుమల్లయ్య స్వామి ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి హనుమాన్ మాల ధారణ చేసిన భక్తులు, గురు స్వాములు కాషాయం జండాలతో గూడూరు గొల్లగూడెం చంద్రగుణంలోని ప్రధాన వీధుల్లో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలోగురుస్వామి భూక్య రవి, భూక్య వెంకన్న, బాధావత్ చందు, మెరుగు మధు, కోయటి దేవేందర్, ఆకారపు వెంకన్న, మొగలగానిరాజు, మాధవరపు యాకయ్య, కోరే దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

డీలర్లకు అవగాహన సదస్సు …
GUDURU,Thovva news.24,MAY Fri
గూడూరు మండలంలోని
విత్తన పురుగు మందులు, ఎరువుల డీలర్లకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. గూడూరు రైతు వేదికలో ఏర్పాటు చేసిన సదస్సులో వానకాలం 2024 వంటకాలానికి సంబంధించి సమయం వచ్చినందున విత్తన విక్రయదారులు ఎలాంటి నియమ నిబంధనను పాటించాలో క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహబూబాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు గౌరవ శ్రీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ విత్తన డీలర్లు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా జారీచేసిన వ్యాలీడ్ లైసెన్సును కలిగి ఉండాలని, షాపు పేరు రాసి ఉండాలని, స్టార్ట్ బోర్డు స్టాక్ బుక్కులను కలిగి ఉండాలని, వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఈ రిజిస్టర్ను ప్రతిరోజు డీలర్ల వారీగా మండల వ్యవసాయ అధికారి సేకరించి విత్తన విక్రయ వివరాలను జిల్లా వ్యవసాయ అధికారికి సమర్పించవలసి ఉంటుందన్నారు. విత్తన డీలర్లు అధికృత డిస్ట్రిబ్యూటర్లు, గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాల ను మాత్రమే అమ్మాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఏ పంట విత్తనాలనైనా రైతులకు విక్రయించవద్దని తెలిపారు. ఎరువుల విక్రయదారులు ఎరువులను ఈపాస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని, ఈపాస్ స్టాక్, గ్రౌండ్ స్టాక్ ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని తెలిపారు.
*రైతు సోదరులకు సూచనలు* వానాకాలం 2024 పంటకాలం సమీపించినందున రైతు సోదరులు వివిధ పంట లకు సంబంధించిన విత్తనాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన లైసెన్సు కలిగిన అధికృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని ఏడిఏ తెలిపారు. రైతులు విత్తనాలను కొన్నప్పుడు తప్పకుండా రసీదు తీసుకొని పంట కాలం పూర్తయ్యేంతవరకు రసీదును భద్రపరుచుకోవాలన్నారు. రైతులు తమకు అనుభవం ఉన్న,చూసిన విత్తన రకాలను మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాలన్నారు.
*పచ్చి రొట్టె విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి* తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పచ్చి రొట్టె ఎరువుల విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీలుగా విత్తనాలు ఇప్పటికే గూడూరు మండల కేంద్రంలోని అగ్రోస్ 1, 2 లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. .ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అల్లే రాకేష్, మండలంలోని ఐదు క్లస్టర్ల ఏఈవోలు, డీలర్లు పాల్గొన్నారు.

పిహెచ్సి డాక్టర్లు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి,,
డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అంబరీష్.
KURAVI.Thovva news.24,MAY Fri
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ అంబరీష్ అన్నారు. శుక్రవారం మండలంలోని బలపాల, కురవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని . ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న పేదవారని క్షుణ్ణంగా పరిశీలించి రోగ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వైద్యులకు సూచించారు. గర్భిణీ స్త్రీల పట్ల శ్రద్ధ పెడుతూ సరియైన వైద్యం అందించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులయ్యేటట్లు చూడాలని సిబ్బందిని హెచ్చరించారు. పిల్లలకు వ్యాక్సినేషన్ 100% ఉండాలని సూచించారు. సాధారణ జబ్బులకు వచ్చే రోగులకు మందులు ఇచ్చి పంపాలని, ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. .ఆయన వెంట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ క్రిష్ణార్జునరావు. సబ్ యూనిట్ ఆఫీసర్ వడ్డెబోయిన శ్రీనివాస్. డాక్టర్ స్రవంతి. డాక్టర్ విరాజిత. డాక్టర్ భార్గవి. సీనియర్ అసిస్టెంట్ కుమారస్వామి. హెచ్ ఇ ఓ సత్యనారాయణ. గౌసుద్దీన్. హెల్త్ అసిస్టెంట్ శ్రీధర్. స్టాఫ్ నర్స్ అనురాధ. కవిత. నాగమణి. సృజన. శోభా. ఏసు మని. ఫార్మసిస్ట్ బాబురావు. ఏఎన్ఎంలు నసీమా బేగం. వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ముగిసిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలీసేట్ – 24).
MHBD..Thovva news.24,MAY Fri
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులతో పాటు, వ్యవసాయ డిప్లొమా, వెటరినరీ డిప్లొమా కోర్సు లలో ప్రవేశం కొరకు శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1-30 గంటల వరకు నిర్వహించిన పాలీసేట్ – 24 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు మహబూబాబాద్ పట్టణంలో (6) పరీక్షా సెంటర్ లలో బాలురు 887, బాలికలు 722 మొత్తం 1609 మంది విద్యార్దులకు గాను బాలురు 784, బాలికలు 645 మొత్తం 1429 మంది విద్యార్దులు హాజరయ్యారు. ఈ పర్యవేక్షణలో సాంకేతిక విద్యాశాఖ జిల్లా కో ఆర్డినేటర్ డి. శోభారాణి , ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి. రాజు, ప్రత్యేక పరిశీలకులుగా ఎం. చంద్ర ప్రకాష్ ( సాంకేతిక విద్యా శాఖ ) , ఏం. శ్రీ రాములు (విద్యా శాఖ ) , యు. నర్సయ్య ( రెవిన్యూ శాఖ ) , యాకుబ్ రెడ్డి ( పోలీస్ శాఖ ) గార్లు పాల్గొన్నారు.

ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించాలి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి
MHBD..Thovva news.24,MAY Fri
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, స్టానిక గ్రామ పంచాయతీ సిబ్బంది తో కలిసి ప్రజలకు ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించేలా అవగాహన కలిగించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. కళావతి బాయి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ మండలం లోని మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు గ్రామాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. కళావతి బాయి సందర్శించారు. ఈ సందర్బంగా అధికారి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని, సిబ్బంది సాధారణ ప్రసవాల వలన చేకూరే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. రానున్న వర్షాకాలము సీజన్ లో సిబ్బంది అందుబాటులో వుండాలని ప్రతి గర్బిణి స్త్రీ ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం కొరకు ప్రోత్సహించాలని అన్నారు. మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకుండా చూడాలని, ఆరోగ్య కేంద్ర పరిధిలో జరుగుతున్న గర్భస్రావాల పైన నిఘా ఉంచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ సుధీర్ కుమార్, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి కొప్పుప్రసాద్, ఎంపిహెచ్ఈఓ తోట శ్రీనివాస్,స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
భాజపా మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు ఇందు భారతి, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్.
MHBD..Thovva news.24,MAY Fri
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న విద్యావేత్త గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని .భాజపా మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు ఇందు భారతి, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్. భాజపా యువమోర్చ అధ్యక్షులు సంపత్ తో కలిసి జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు సందర్శించి పట్ట బద్రుల నుంచి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేస్తామని ప్రగల్బాలు పలకడమే తప్ప ఆచరణ శూన్యమన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఆర్థిక ప్రగతి సాధించింది అన్నారు. విద్యా వైద్యం మౌలిక వసతులు కల్పన బిజెపితోనే సాధ్యమన్నారు. నిబద్ధత, నిజాయితీ కలిగిన ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తే చట్టసభలలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తారని తెలిపారు. చదువుకున్న మేధావులైన యువత దుష్ప్రచారాలకు తావివ్వకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ భాజపా నాయకులు పాల్గొన్నారు