ఆక్రమంగా తరలిస్తున్న పట్టించుకొని అధికారులు..
మైనింగ్ అధికారుల తీరు మారాదా అంటున్న ప్రజలు
తోవ్వ, మహబూబాబాద్.మే 27;
మానుకోటలో మట్టి మాఫియా అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది వారి ఆగడాలు మూడు టిప్పర్లు… ఆరు టాక్టర్లు అన్న చందంగా సాగిపోతుంది. మట్టి దందాకు గుట్టలకు గుట్టలే మాయమవుతున్నాయి మహబూబాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇటుక బట్టీలకు విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నారు చెరువులు కుంటలు తోపాటు ప్రభుత్వ భూములు విలువైన మట్టిని తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు.
*జేసిబి. పేలుళ్లతో జనం బేజారు*
మట్టి తవ్వకాలకు ఉపయోగించే జెసిబిల శబ్దంతో రాత్రులు నిద్ర పోవాలంటే చుట్టూరా ఉన్న ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వివేకాక మట్టి తవ్వకాల్లో అడ్డొస్తున్న చిన్న చిన్న గుట్టలను రాళ్లను ఎటువంటి అనుమతులు లేని పేలుడు పదార్థాలను ఉపయోగించి బండరాలను పేల్చుతున్నారు ట్రాక్టర్ మట్టికి 1000 నుంచి 1500 వసూలు చేస్తూ మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది జిల్లాలోని శంగాపురం ప్రాంతంలో ఇటీవల కాలంలో ఏదేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్న అటు రెవెన్యూ ఇటు భూగర్భ గనుల శాఖ తొంగి కూడా చూడటం లేదు…
*ఇటుక బట్టిలకు చెరువు మట్టి*
జిల్లాలోని చెరువులు కుంటల్లో నీళ్లు లేక ఇంకిపోవడంతో మట్టి దొంగలు చెరువుల్లో మట్టి కుంటలు మట్టిని ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిస్తున్నారు గత ప్రభుత్వం చెరువుల మట్టిని సాగు భూముల సా ఉపయోగించే వారు కానీ నేడు అదే మట్టిని ట్రాక్టరు ధర ఎక్కువ మొత్తంలో వెచ్చించి బట్టి ఓనర్లు కొనుగొలుచేస్తున్నారు.బయ్యారం మండలంలో జోరుగా మట్టి మాఫియా విజృభిస్తుంది… జిల్లా కేంద్రంలో విలువ కలిగిన ఎర్రమట్టి నీ వేచర్లకు తరలిస్తూ ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారు.