అమ్మాయిలతో వలవేసిపర్స్ ఖాళీ చేయిస్తున్నముఠా అరెస్ట్
పోలీసుల అదుపులో పబ్ ఓనర్లు, మేనేజర్

తొవ్వ ,హైదరాబాద్,జూన్13;
అమ్మాయిలను ఎరగావేస్తూ పబ్ లో ఎంజాయ్ చెదమంటూ పిలిచి పర్స్ ఖాళీ చేయిస్తున్న ముఠా సభ్యులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ బాధితుడు మాదాపూర్ గలేరియా మాల్లోని మోష్ పబ్లో తాను గుర్తుతెలియని అమ్మాయి చేతిలో ఎలా మోసపోయానో, పబ్ నిర్వాహకులు ఎలా చీట్ చేశారో వివరిస్తూ సోషల్ మీడి యాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ ఘటనకు సంబంధించి తొవ్వ ప్రతినిధి పూర్తి సమాచారమ్ కూపి లాగగా . పబ్ యజమానులు అమ్మాయిలతో కలిసి చేస్తున్న మోసంగూర్చి వెలుగులోకి రావడంతో స్పందించిన మాదాపూర్ పోలీసులు పక్కా ప్రణాళికతో ఆరుగురు సభ్యుల ముఠానుఅరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను బుధవారం మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్ వెల్లడించారు.ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులముఠా గ్రూపుగా ఫామ్ అయ్యారు. వీరుమోష్ నిరుద్యోగ యువతులను ట్రాప్ చేసి వారీ పేరు మార్చి డేటింగ్ సెట్లో ఫొటోస్ పెట్టి యువకులతో చాట్ చేయిస్తారు.ఈ ముఠాలోని అమ్మాయిలు అబ్బాయిలను ట్రాప్ చేసి దగ్గరలోని పబ్ కి తీసుకు వెళ్తారు. అంతకు ముందే ఆయా పబ్ మేనేజర్లతో ఒప్పందం కుదుర్చుకునిఇలా తీసుకువచ్చిన వారి నుంచి బిల్లలో తమ వాటా మాట్లాడుకుంటారు.ఇందుకుగాను వీరికి ఆయా పబ్లలోసపరేట్ క్యూఆర్ కోడ్ మెషిన్, సపరేట్ సర్వ్ చేసే వాళ్లూ ఉంటారని డీసీపీ తెలిపారు. డెవిల్స్ నైట్ పేరుతో సపరేట్ మెనూ అమ్మాయితో వచ్చిన కస్టమర్కు ఇస్తారు. అక్కడి సర్వర్లు అమ్మాయిలకు10 ఎంఎల్, కస్టమర్కు 30 ఎంఎల్ చొప్పున ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. అలాగే భారీగా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. దీంతో పెద్ద మొత్తంలో బిల్ అవుతుంది. అప్పటివరకు అబ్బాయితో ఉన్న అమ్మాయిలు తీరా బిల్లింగ్ సమయానికి ఏదో రకంగా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. కస్టమర్లకు ఎక్కువ బిల్లు వేస్తున్న పబ్ నిర్వా హకులు అలా వచ్చిన మొత్తాన్ని ఈ గ్రూపు, అమ్మాయి, పబ్ నిర్వాహకులు షేర్ చేసుకుంటున్నారు. ఈ ముఠా నగరంలో నలభై రోజుల్లో రూ.40 లక్షలవరకు మోసం చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ఇలా ఈ గ్యాంగ్ నెల రోజుల తరువాత మరో ప్రాంతానికి షిఫ్ట్అవుతుంది. మోష్ పబ్ వ్యవహరం బయటకు రావడంతో వీరు హైదరాబాద్ నుంచి నాగపూర్ లో సైతం ఇదేతరహాలో మోసం చేసేందుకు వెళ్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి8 మొబైల్స్, కియా కారు సీజ్ చేశామని, ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. అలాగే మోష్ పబ్ మేనేజర్ చెరుకుపల్లి సాయికుమార్, ఓనర్లు తరుణ్, జగదీశ్లను సైతం అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

