పాడే మోసి నివాళి అర్పించిన డిఎస్పీ
కన్నీటి పర్యంతం అయిన “కొంగర గిద్ద”
తోవ్వ. మహబూబాబాద్ జూన్ 13;


అధిక లోడుతో వరంగల్ కు వెళ్తున్న కర్ర లారీ బోల్తా పడి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందిన సంఘటన లో
గూడూరు మండలం కొంగరగిద్దకు చెందిన గూడూరు సిఐ గన్మెన్ దానసరి పాపారావు అంతిమ వీడ్కోలు . కుటుంబ సభ్యులు అధికారులు కన్నీటి సంద్రం మధ్యలో పోలీసు లంచనలతో ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ తిరుపతి రావు దగ్గరుండి పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకెన్ పాపారావు చిన్నారి నీ ఎత్తుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పోస్ట్ మార్టం కార్యక్రమం పూర్తి చేయించి అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేయించారు. డిఎస్పీ తిరుపతి రావు పాడే మోసి తన ఉద్యోగి కి ఆఖరి సంస్కారం అందించారు పోలీసులు గౌరవ వందనం సమర్పించి నివాళి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా లోని పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
