ఉపముఖ్యమంత్రి భట్టి స్టేట్ ఇన్చార్జి దీప్ దాస్ కూడా పయనం
మంత్రి వర్గ విస్తరణ…..నూతన పీసీసీ కి ముహూర్తం ఖారార్
ఆశావహులు పరుగులు
thovvaweb news//23 august10:30pm

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రి 9.30 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు పార్టీ ఇన్ఛార్జ్ కలిసి వెళ్తుండటంతో ఈసారి తప్పకుండా మంత్రిమండలి కూర్పుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మిగిలిన నామినేటెడ్ పదవుల పంపకం, కొత్త పీసీసీ చీఫ్తో పాటు పార్టీలో కీలక పదవుల నియామకంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
[