ఆంతిమ సంస్కారాల కు అదుకున్న చిలువేరు సమ్మయ్య గౌడ్
Thovva web news.in.25,aug.2024 11:00.AM

కేసముద్రం విలేజ్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మలిశెట్టి సురేష్ తండ్రి వీరయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు.ఈ నేపథ్యంలో దహన సంస్కారాలకు నిరుపేద కుటుంబం ఇబ్బంది పడుతున్నారని స్థానికులు సమ్మయ్య గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన చిలువేరు సమ్మయ్య గౌడ్ బాధితుడి ఇంటికి చేరుకొని వీరయ్య పార్దివ దేహానికి పూలమాలలతో నివాళులర్పించారు. బాధితుడి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతుడి కుటుంబానికి అన్ని వేళల అండగా ఉంటానని దహన సంస్కారాలకు 8,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలు ఏ కష్టంలో ఉన్న తన దృష్టికి తీసుకువస్తే తన వంతు సాయంగా సహాయం చేస్తానని తెలిపారు. నిరుపేద కుటుంబాల పట్ల చిలువేరు సమ్మయ్య గౌడ్ చూపుతున్న దాతృత్వానికి గ్రామస్తులు సమ్మిగౌడ్ ను ఈ సందర్భంగా అభినందించారు..సమ్మిగౌడ్ తో పాటు ఎర్రం శెట్టి అశోక్,వల్లందాస్ రవి,తుంపిల్ల వెంకన్న,రాంబాబు,చిట్ల సోమన్న, కొండేటి కళాధర్, బెజ్జం నాగన్న,రబ్బాని, గుంశావళి తదితరులు పాల్గొన్నారు..