వీరోచిత మట్టి మనుషులు తిరుగుబాటు

తెలంగాణ జలియన్ వాలాబాగ్‌ కి 76 ఏండ్లు…..

బైరాన్‌పల్లి చరిత్రకెక్కని ఓ నెత్తుటి గాథ.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్‌పల్లి చరిత్రకెక్కని ఓ నెత్తుటి గాథ. అదో వీరోచిత పోరాటం, సరిగ్గా 76 ఏళ్ల క్రితం జలియన్‌ వాలాబాగ్‌ను మించిన నరమేధం. ఎందరో మట్టి మనుషులు తిరుగుబాటు చేసి అమరులై నేలకొరిగిన వైనం. దోపిడీపై దండయాత్ర జరిపి రజాకారు మూకలపై నిప్పు కణికలై రగిలిన ఈ ఘటనే సాయుధ పోరాటానికి పెద్దఎత్తున సాగేందుకు ఊపిరి పోసింది.భారతావనికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా, తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న విమోచనం కలిగింది. స్వాతంత్య్రం వచ్చాక కూడా 13 నెలల పాటు ఈ ప్రాంతం నిజాం రాక్షస పాలనలో కొనసాగింది. వీరికి వ్యతిరేకంగా అప్పట్లో తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. ఇదే ఏడాది ఆగస్టు 27న జరిగిన బైరాన్‌పల్లి ఘటన చరిత్రకెక్కని గాథగా మిగిలింది. ఆ రోజు గ్రామానికి చెందిన 96 మంది యోధులను ఒకే వరుసలో నిలబెట్టి నిజాం సైనిక అధిపతి ఖాసీం రజ్వి సారథ్యంలో రజాకార్లు కాల్చిచంపారు.ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా 76 ఏళ్లు. ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అరాచకాలు సృష్టించారు. సిద్దిపేట జిల్లాలోని మద్దూరు, లద్నూరు, సలాఖపూర్, రేబర్తి గ్రామాలను రజాకార్లు కేంద్రాలుగా చేసుకొని సమీప గ్రామాల్లో దాడులకు తెగబడుతూ సంపదను దోచుకునేవారు. ఈ అరాచకాలను ఎదిరించేందుకు గ్రామాల్లోని యువతంతా కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డారు. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్టలో ఈ రక్షక దళాలు బైరాన్‌పల్లిని కేంద్రంగా పని చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *