కేంద్రంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం లో ఉద్యోగుల నిరసన ర్యాలి
Thovva web news.in//01sep.sun.4:00 pm

కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం విధానం రద్దు చేసి,పాత పెన్షన్ విధానం అమలు ప్రకటన చేయాలని ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా జేఏసీ సభ్యులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఎంఆర్ఓ సెంటర్ వద్ద . ఈ కార్యక్రమం నిర్వహించారు జేఏసీ నాయకులు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది .టీజీ ఈ జేఏసీ చైర్మన్ వడ్డెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితంలో ఆర్ధిక ఇబ్బందులతో సతమతం కాకుండ ఉద్యోగుల సేవలకు ప్రతిఫలంగా, సామాజిక భద్రత కల్పించేందుకు పెన్షన్ ఇవ్వాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్లో 2004లో పాత పెన్షన్ స్థానంలో కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చినప్పటి నుండి తెలంగాణ ప్రాంత ఉద్యోగులు పాత పెన్షన్ విదానాన్నే కొనసాగించాలని రెండు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న గత ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ల సాధన దిశగా ఎటువంటి చొరవ చూపకపోవడంతోపాటు మరింత నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడంతో అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు అండగా నిలిచారని, 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారిని సీపీఎస్ విధానం పరిధిలోకి తీసుకువచ్చేలా G.O.M.S.No. 653 జారీ చేశారు దానికి కొనసాగింపు గా తెలంగాణ రాష్ట్రం లోG.O.M.S.No. 28 ద్వారా కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానంలోని వెళ్లడం జరిగింది సిపిఎస్ ఉద్యోగులు ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ పొందే అవకాశం లేకపోవడంతో అవసాన దశలో పౌరులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తమ సామాజిక బాధ్యతగా ప్రతి పౌరుడికి పెన్షన్ ఇవ్వాలని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను పరిగణలోకి తీసుకొని, వారి సమస్యలు పరిష్కరించి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో సైతం పేర్కొన్నట్లుగా కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు కొరకు మరియు పాత పెన్షన్ పునరుద్ధరణకై అధ్యయనం చేపట్టి, విశ్రాంత ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించటముతోపాటు, ఆత్మగౌరవంతో జీవించగలిగే పరిస్థితులు నెలకొల్పేందుకురెండు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగ ఉపద్యాయుల డిమాండ్ అయిన కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానం స్థానే పాత పెన్షన్ విధానం అమలు కు తదనుగుణంగాతగు చర్యలు చేపట్టగలరని కోరారు. టీజీవో అధ్యక్షులు రఫీపిఆర్టియు మహబూబాద్ జిల్లా అధ్యక్షులు సంఘ బద్రి నారాయణ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి పిడిఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీశైలం డీఎస్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆవనూరి రవి టి ఎస్ సి పి ఏ జిల్లా అధ్యక్షులు పూసపాటి నాగమణి టీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ నాయక్ టిఎస్పిఎస్సి జిల్లా ఉపాధ్యక్షుడు విఎండి రఫీ కళ్లెం వీరారెడ్డి రాంజీ బిక్షపతి సారెడ్డి రామిరెడ్డి హరినాయక్ మంగీలాల్ మేకల కుమార్ ప్రవీణ్ కుమార్ సింగం రమేష్ డి వీరన్న అశోక్ రమేష్ గోనిగంటి శీను కోడెం శ్రీనివాస్ మొదలగు వారు పాల్గొన్నారు…