సాగంటి మంజుల
Thovva web news.in//01.sep ,sun 5.pm

సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రులు సందర్భాన్ని పురస్కరించుకుని సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే డ్రాయింగ్ పోటీల్లో భాగంగా ఈ మాసం లో పర్యావరణానికి మేలు చేసే మట్టి వినాయకులను తయారు చేసే పోటీ నీ ఆదివారం హనంకొండ లష్కర్ బజార్ లోనీ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల.. సుమారు 30 మంది చిన్నారుల తో మట్టి వినాయకులు చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంలో.. సంస్థ డైరెక్టర్ సాగంటి మంజుల మాట్లాడుతూ రసాయనాలు కలిపిన మట్టితో చేసే వినాయక విగ్రహాలు పర్యావరణానికి హానీ చేస్తాయని, ప్రకృతిలో విరివిగా లభ్యం అయ్యే నల్ల రేగడి మట్టి, బంక మట్టి తో వినాయక విగ్రహాలు చేసి ఇంట్లో పూజలు చేసుకోవాలని సూచించారు.. చిన్నారుల చేతి వేలి కోనల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయని వాటిని వెలికి తీసే బాధ్యత తల్లిదండ్రులు , ఉపాధ్యాయులదే అనీ తెలిపి పిల్లలనీ ప్రోత్సహించారు.. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు…ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హారతి, ఆర్టిస్ట్ రమేష్, బదిరుల పాఠశాల ఉపాధ్యాయుడు యాకయ్య, తల్లిదండ్రులు పాల్గొన్నారు…

