హైడ్రా తరహా ప్రత్యెక చట్టం కి చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు….
మహబూబాబాద్ చెరువుల కబ్జా పై ఎమ్మెల్యే పిర్యాదు….
ముఖ్యమంత్రి యాక్షన్ ప్లాన్… కబ్జా లకు సహకరించిన అధికారుల పై కొరడా….
Thovva web news.// 03 sep..Tue.3.pm

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా (#HYDRAA) తరహా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను అధికారులను ఆదేశించారు. చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేపడుతామని ప్రకటించారు. ఆక్రమణ దారులు ఎవరున్నా, ఎంతటి వారున్నా వాటిని తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. చెరువుల కబ్జా కి సహకరించిన అధికారులపై కొరడా జులు పించండి అని ఆదేశాలు జారీచేశారు.వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి గారు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జల వనరులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం వ్యవస్థీకరించిన హైడ్రా తరహా జిల్లాల్లో కూడా విధివిధానాలతో వ్యవస్థ ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.”చెరువుల ఆక్రమణలపై రాష్ట్రం మొత్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతాం. ప్రజా ప్రతినిధులు, సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారైనా కావొచ్చు. ఏ ఒత్తిడి వచ్చినా ఈ ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం వెనక్కి తగ్గదు. చెరువులు, కుంటలు, కాలువలు, నాలాలకు సంబంధించి ఆక్రమణలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలకు సహకరించిన అధికారులపైన కూడా చర్యలు ఉంటాయి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
మానుకోట ,ఖమ్మం పై ప్రత్యెక దృషి…
చెరువుల ఆక్రమణ పై ముఖ్యమంత్రి ప్రత్యెక కార్యాచరణ చేపట్టాలని ముఖ్యంగా మహబూబాబాద్ చెరువులు కబ్జాలు బాగా జరిగిన సందర్భంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేసిన పిర్యాదు పై స్పందించారు అనంతరం ఖమ్మం జిల్లా లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కబ్జా చేసిన నాలలు కాలువలు పైన స్పందించారు దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ఎందుకు స్పందించారు…అని ప్రశ్నించారు…

