ప్రాంతాల విపత్తులపై సమగ్ర సమాచారం నిక్షిప్తం చేయాలి…
రాబోయే విపత్తులన్నుంచి ముందే మేల్కొనవచ్చు…
మహబూబాబాద్ సమీక్ష సమావేశంలో అధికారులకు బ్లు బుక్ సూచన…..
Thovva web news.in// 03 sep,Tue.4:pm


రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ వర్షాలు వరదల తో జన జీవనం స్తంభించిపోయింది. మున్నేరు ఉదృతికి ఖమ్మం జిల్లా పూర్తిగా దెబ్బ తిందని మహబూబాబాద్ జిల్లా లో అకేరు వాగు విధ్వంసం జరిగి ఇద్దరు మృతిచెందరని పలు అర్ అండ్ బి రోడ్లు .నేషనల్ హైవే లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు . పూర్తిగా ధ్వంసం అయ్యాయని. వేల ఎకరాల పంట నష్టం పశు సంపద గొర్రెలు మేకలు జీవలు పూర్తిగా వరద నీటిలో కొట్టుకోని పోయాయని ఇవన్నీ మన కు గుణపాఠం కావాలని ముఖ్యంగా జరిగిన విపత్తు ను ప్రతి జిల్లా అధికారి ఒక నివేదిక రూపంలో అందించి జిల్లా లో కలెక్టర్ ఇతర ఉన్నత అధికారులు “బ్లూ బుక్ ” ను మెయింటైన్ చేసి విపత్తులు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు నిక్షిప్తం చేయాలని ఇలా చేయడం వల్ల అధికారులు బదిలీపై వెళ్లిన వేరొక అధికారి కి పూర్తి స్థాయిలో విపత్తు తలెత్తినప్పుడు జాగ్రత్తలు తీసుకొని విపత్తుల్లో ఎక్కువ నష్టం జరగకుండా చర్యలు చేపట్టవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు మహబూబాబాద్ జిల్లా వరద ముంపు ప్రాంతాలను సందర్శించి అనంతరం కలెక్టర్లు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో అధికారులకు బ్లూ బుక్ పై అవగాహన కల్పించారు ముందుగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బ్లూ బుక్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి దీనిపై పూర్తిగా సమాచారం ఇస్తూ అధికారులు బ్లూ బుక్ వెంటనే ఏర్పాటు చేయాలని దీనివల్ల విపత్తులకు వెంటనే తీర్పుని పని చేసే అవకాశం ఉంటుందని సూచించారు