విద్యార్థుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ను బహుకరణ.!
కోల్పోయిన స్నేహితులకు నివాళులర్పణ.!
Thovva web news.in.//13;oct.sun 6:30 p.m.

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిసాము.. చదువుల చెట్టు నీడలో అంటూ చిన్నగూడూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 2008-2009 పదవ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వవిద్యార్ధులు ఆదివారం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. కుటుంబ బాధ్యతలను మోస్తూ ఎక్కడెక్కడో స్ధిరపడిన వారంతా ఒకేచోటకు చేరుకొని అప్యాయంగా పలకరించుకున్నారు.ఒకరినొకరు ఆలింగనం చేసుకొని నిక్నేమ్లతో పిలుచుకుంటూ తీపి జ్ఞాపకలను గుర్తు చేసుకున్నారు.మృతి చెందిన మిత్రులు చిరంజీవి, యాకన్నా, ఉపేంద్ర, మహేశ్వరీ లకు నివాళులర్పించారు.చదువుకునే విద్యార్థుల సౌకర్యార్థం మినరల్ వాటర్ ప్లాంట్ ను బహుకరించారు.విద్యార్థుల యోగా క్షేమాల గురించి ఆరా తీసుకుంటూ పాఠాలను నేర్పించిన 13 మంది గురువులను సత్కరించారు.15 ఏళ్ల నాటి విద్యార్థులను చూసిన ఉపాధ్యాయులు తన్మయత్వంతో మునిగిపోయారు.ఈ కార్యక్రమంలో. టీచర్స్ వెంకటేశ్వర్లు. ఈశ్వర్ .ఉషశ్రీ. రహేమత సుల్తాన్. వెంకన్న వేణు వీరన్న. విద్యార్థులు చిత్తారి సోమన్న ఆందోత్ చెందులాల్ సందీప్ కృష్ణ జగన్ రహీం నరేష్ భాస్కర్ మౌనిక అనూష మమత తదిరు పాల్గొన్నారు