‘అలయ్ బలయ్’ స్ఫూర్తిగా పనిచేద్దాం…
ఆలయ్ బలయ్ లో ఆత్మీయ సమ్మేళనం లో రేవంత్ రెడ్డి
Thovva web news.in //13.oct.sun 5:pm
కల్చరల్ వింగ్… స్పెషల్ కరస్పాండెంట్. నిండే భావన యాదవ్

తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడనికి ఆలయ్ బలయ్ స్పూర్తి పనిచేస్తుందని తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఆవిర్భావానికి కూడా అలయ్ బలయ్ ఉపయోగపడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మనందరి బాధ్యతగా సీఎం పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ కూడా తెలంగాణ కోసం ఉద్యమించాయన్నారు. అన్ని సామాజిక వర్గాలు కార్యోన్ముఖులు కావడానికి అలయ్ బలయ్ దోహదపడిందని సీఎం వివరించారు. ఆదివారంనాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బండారు విజయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటైన అలయ్ బలయ్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు అతిపెద్ద పండగ దసరా అని, ఈ పర్వదినాన అందరికీ గుర్తొచ్చేది పాలపిట్ట, జమ్మిచెట్టు అన్నారు. మరోవైపు ‘అలయ్ బలయ్’ అంటే గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ‘అలయ్ బలయ్’ స్ఫూర్తిగా పనిచేసిందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.

రాజకీయాలు లేని అలయ్ బలయ్
రాజకీయాలకు అతీతంగా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో పది మందిని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అంతర్జాతీయ గుర్తింపు పొందిన గొంగళితో సన్మానించారు. దత్తాత్రేయ వారసత్వాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ముందుకు తీసుకు వెళ్లడం అభినందనీయమని సీఎం అన్నారు. ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా వీహెచ్, కేశవరావు, పొన్నం ప్రభాకర్ అలయ్ బలయ్లో పాల్గొన్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఇది రాజకీయాలకు సంబంధం లేదని, అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను దత్తాత్రేయ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.


