
ఇడంపాక శ్రీశైలం
కామ్రేడ్ సుంకరబోయిన గోపాల్, వాసం పాపన్న కు నివాళులు…
కొత్తగూడ నవంబర్ 3 తొవ్వ:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని ఏజెన్సీ ప్రాంతం లో గ్రామ గ్రామాన సిపిఐ (ఎంఎల్)న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండా ఎగురవేస్తూ… పేద ప్రజల కోసం అమరులైన అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.అమరవీరులకు ఆంజలి ఘటిస్తూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ బాధ్యతగా మేమున్నామంటూ అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని ఇ. శ్రీశైలం అన్నారు. వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎంచగూడం గ్రామంలో ర్యాలీ నిర్వహించి కామ్రేడ్ సుంకరబోయిన గోపాల్, వాసం పాపన్నస్థూపం వద్ద నివాళులు అర్పించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ కమిటీ సభ్యులు బండి వెంకన్న,వాసం విరస్వామి, బండి పెద్ద కుమారస్వామి పాల్గొన్నారు. .