సొంతగూటికి వార్డు సభ్యుడు


-ప్రలోభాలకు లొంగము సొంతింట్లోనే ఉంటాము

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

డోర్నకల్-తొవ్వ(నవంబర్5)

జర్నలిస్ట్ రామ్ గౌడ్

బిఆర్ఎస్ మద్దతుతో వార్డు సభ్యుడుగా గెలుపొందిన వలదాసు ఉపేందర్ ఆదివారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ మాయమాటలు నిజం కాదని గ్రహించి తిరిగి సోమవారం మాజీ సర్పంచ్(సర్పంచుల ఫోరం అధ్యక్షులు) బోయినపల్లి వెంకన్న సమక్షంలో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా వెన్నారం గ్రామానికి మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సేవలు మా ఊరి మాజీ సర్పంచి బోయినపల్లి వెంకన్న సహకారం గుర్తు చేసుకుని తిరిగి సొంత పార్టీలోకి వచ్చినట్లు చెప్పారు. మాజీ సర్పంచ్ బోయినపల్లి వెంకన్న మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సహకారంతో వెన్నారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్టు తెలిపారు. కొందరు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి జరగకుండా అనేక ఇబ్బందులకు పెట్టినా రాజీ పడకుండా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రజలు నా వెంటే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్ వెంకన్న గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా సొంత పొలం అమ్ముకుని గ్రామాన్ని అభివృద్ధి చేసిన రోజులను ఆయన గుర్తు చేశారు. ఆయన మార్గంలోనే వెన్నారం అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *