సొంతింటికి మరో వార్డు సభ్యుడు-చేసిన తెలుసుకున్నాం,మరోమారు జరగనివ్వం

సొంతింటికి మరో వార్డు సభ్యుడు-చేసిన తెలుసుకున్నాం,మరోమారు జరగనివ్వం
-మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఉన్నంతకాలం బీఆర్ఎస్ వదలబోము
-వెన్నారం వార్డు సభ్యులు వలదాసు ఉపేందర్, అనేపర్తి సైదులు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

డోర్నకల్-తొవ్వ(నవంబర్5)

డోర్నకల్ ప్రతినిధి రామ్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్, వెన్నారం గ్రామ మాజీసర్పంచ్(డోర్నకల్ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు) బోయినపల్లి వెంకన్న ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీని వదలబోమని డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన వార్డు మెంబర్లు వలదాసు ఉపేందర్, అనేపర్తి సైదులు అన్నారు. కాంగ్రెస్ నాయకులు వారి వార్డు ప్రజలకు ఏదో చేస్తాం ఏదో ఇస్తామని ప్రలోభబెట్టి కండువాలు కప్పి వారిని మాయ చేశారని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తో మాత్రమే సాధ్యమని అధికారంలో లేకున్నా కొట్లాడడం కొతెం కాదని చేసిన తప్పును తెలుసుకుని తిరిగి సొంతగూటికి చేరుకున్నట్టు వారు తెలిపారు. మంగళవారం మాజీ సర్పంచులు ఫోరం అధ్యక్షులు బోయినపల్లి వెంకన్న వారికి బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి తిరిగి స్వాగతం పలికారు. గతంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు వెన్నారం అభివృద్ధి చూస్తూ అందులో పాలుపంచుకున్న వార్డు సభ్యులు తిరిగి సొంతగూటికి చేరడం అనాధంగా ఉందని వెన్నారం గ్రామంలో అందరూ సోదర భావంతోనే మెదులుతారనేదానికి నాపై ప్రేమతో తిరిగి బీఆర్ఎస్ పార్టీకి చేరిన వీరి ప్రేమే నిదర్శనమని వెంకన్న అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజాబలం చూపిస్తామని, అధికారంలో లేకున్నా పోరాటాలు కొతెం కాదని వెన్నారం అభివృద్ధి కోసం పోరాడేందుకు సిద్ధమని, స్థానిక ఎన్నికల్లో వారి బలం చూపిస్తామని ప్రజలు మావైపే ఉన్నారని వెంకన్న గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *