డోర్నకల్ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ

అధ్యక్షుడిగా మాతంగి అనిల్ మాదిగ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

డోర్నకల్ నవంబర్ 15 తొవ్వ :మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని బాబు జగ్జీవన్ రావ్ విగ్రహ సమీపంలోని ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ నిర్మాణానికి ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు,డోర్నకల్ మండలం ఇన్చార్జి గుగ్గిళ్ళ పీరయ్య మాదిగ ఆధ్వర్యంలో డోర్నకల్ మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మాదిగలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ మాదిగ జాతి అభివృద్ధి కోసం చేసే పోరాటాన్ని,సమాజానికి దండోరా సాధించి పెట్టినటువంటి ఉద్యమ ఫలితాలను తెలియజేయడం జరిగింది.అదేవిధంగా పాలకవర్గాలు మోసం చేస్తున్న అంశాలను కులంకషంగా తెలియజేయడం జరిగింది.వర్గీకరణ జరగకుండా చేస్తున్న కుట్రలను చేదించడం కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా నేడు మండల కమిటీ ఎన్నిక జరుగుతుందని తెలియజేశారు.మండల కమిటీ అధ్యక్షుడిగా మాతంగి అనిల్ మాదిగ ను ఎన్నుకోవడం జరిగింది.ఉపాధ్యక్షులుగా దారమళ్ళ శీను మాదిగ,గుదేటి మల్లయ్య మాదిగ,కందుల మధు మాదిగ,అధికార ప్రతినిధి బర్గల రమేష్ మాదిగ,ప్రధాన కార్యదర్శిగా పుట్టల చందు మాదిగ,ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పుట్టల వెంకటేశ్వర్లు మాదిగ,కందిపాడు బిక్షపతి మాదిగ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *