20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డ్రాఫ్ట్ మన్ జ్యోతి క్షేమ భాయ్…….
అవినీతి ఉద్యోగి పై కలెక్టరేట్ లో కలకలం..
Thovva web news.21, Thu 1;30.p.m mahabubabad collecter at

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవినీతి అధికారి ఎసిబి కి చిక్కింది. ఆర్టీఐ ద్వారా సమాచారం కోరిన బాధితుని వద్ద 20 వేలు లంచం అడిగి తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉచ్చు బిగించి అవినీతి తిమింగిలన్ని పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే జిల్లా కలెక్టరేట్ లోని భూ సర్వే రికార్డుల శాఖ లో డ్రాఫ్ట్మన్ గా జ్యోతి శర్మ భాయ్ పనిచేస్తున్నారు బాధితుడు వరంగల్ కి చెందిన కార్తీక్ గుండ్రతిమడుగు రెవిన్యూ పరిధిలో 2,1/2 ఎకరాల భూమి కొనుగొలుచేయగా దానికి సంబందించిన డ్రాఫ్ట్ కాపీ అడుగగా టి పా కింద 5వేలు రూపాయలు కట్టారు. 20 వేల రూపాయలు తనకు ఇస్తేనే డ్రాఫ్ట్ మ్యాప్ ఇస్తానని డిమాండ్ చేయడం తో ఏసీబీ నీ ఆశ్రయించి.డిఎస్పీ సాయిలు సిఐ లు రాజు, రఘు లు పాల్గొని భాదితున్ని 20 వేల రూపాయలు ఇస్తుండగా పట్టుకున్నారు. సదరు ఉద్యోగి ఉద్యోగుల సంఘం ప్రతినిధి గా వుంటూ ఇలాంటి అవినీతి చేయడం తో ఇదేమి పద్ధతి అని ముక్కున వేలేసుకుంటున్నారు మిగతా ఉద్యోగులు ఈమె కాక ఇంకా చాలా మంది అవినీతి పాల్పడే ఉద్యోగులు కలెక్టరేట్ లో తిష్ట వేసి కుర్చుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.