గాయాలపాలైన వారిని స్వయంగా ఆస్పత్రిలో చేర్చిన జర్నలిస్ట్ సీతారాం
డోర్నకల్ నవంబర్22(తొవ్వ):రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని గాయాలతో ఉన్న క్షతగాత్రులను డోర్నకల్ నియోజకవర్గ సీనియర్ జర్నలిస్ట్(ఐజేయు) జిల్లా కోశాధికారి జస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ వ్యవస్థాపకులు గండి సీతారాం గౌడ్ విధి నిర్వహణలో అటుగా వెళుతూ క్షతగాత్రుల పరిస్థితిని చూసి తాన వాహనంలో ఆస్పత్రికి తరలించి వైద్యులతో మాట్లాడి వైద్యం అందించేలా కృషి చేశారు. స్పందించిన జర్నలిస్ట్ తీరును చూసి అక్కడి స్థానికులు అభినందనల వర్షం కురిపించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నాకెందుకులే అని వదిలేయకుండా మానవత్వంతో సహాయం చేయాలని సీతారాం గౌడ్ అన్నారు.